ఒకే ఒక్క నియోజకవర్గం.. కీలక నేతల మధ్య తీవ్రమైన పోరుగా మారనుంది. అదే ఉమ్మడి తూర్పు గోదావ రి జిల్లాలోని పి.గన్నవరం. ఈ సీటు నుంచి టీడీపీ తరఫున అనేక మంది పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధానం గా మహాసేన పేరుతో యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మాల సామాజిక వర్గానికి చెందిన రాజేష్ పి.గన్నవరం టికెట్ను ఆశిస్తున్నారు. అయితే.. ఇదే టికెట్ను దివంగత గంటి బాలయోగి కుమారుడు గంటి హరీష్ కూడా ఆశిస్తున్నారు.
గత 2019 ఎన్నికల్లో హరీష్ అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ దఫా.. అమలాపురం ఎంపీ స్థానం వదిలి.. అసెంబ్లీకి రావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తొలుత అమలాపురం టికెట్నే హరీష్ ఆశించారు. అయితే, అనూహ్యంగా అనేక మంది ఇక్కడ తెరమీదికి వచ్చారు. దీంతో పీ. గన్నవరం నుంచి అయినా.. తనకు అవకాశం ఇవ్వాలనేది గంటి వారసుడి డిమాండ్ గా ఉంది. కానీ.. పరిస్థితి చూస్తే.. ప్రచారంలోనూ.. వైసీపీని టార్గెట్ చేయడంలోనూ.. గంటి హరీష్ వెనుకబడ్డారు.
ఇదే సమయంలో మహాసేన రాజేష్ దూకుడుగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన మాల సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి.. వారి సమస్యలపై బలమైన గళమే వినిపించారు. ఇదే సమయంలో వైసీపీపైనా దూకుడుగా ఉంటున్నారు. ఇప్పుడు మహాసేన రాజేష్ ఏపీ, తెలంగాణలో ఏ రేంజ్లో పాపులర్ అయ్యారో చూస్తూనే ఉన్నాం. వైసీపీని ఓ రేంజ్లో ఏకేస్తూ టీడీపీకి బలమైన వాయిస్గా మారారు. దీంతో రాజేష్వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం.
అయితే.. పోటీ మాత్రం ఎక్కువగానే ఉంది. మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె సత్యశ్రీ సహా.. మోకా బాలగణపతి, మోకా ఆనంద సాగర్ వంటివారు కూడా పి.గన్నవరం టికెట్ను ఆశిస్తున్నారు. అయినప్పటికీ.. బలమైన గళం వినిపించడంలోనూ .. వైసీపీని టార్గెట్ చేయడంలోనూ దూకుడుగా ఉన్న నాయకులకే టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇలా ఎంతమంది ఈ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నా కూడా గత రెండు న్నరేళ్లుగా వైసీపీపై విరుచుకుపడుతున్న మహాసేన రాజేష్ వైపే.. పార్టీ మొగ్గు చూపనుందని తెలుస్తోంది. అయితే.. గంటి హరీష్కు మాత్రం.. పార్టీ బాధ్యతలు లేదా.. అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్సీ వంటి హామీ లు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.