Pushpa 2: డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం “పుష్ప 2” సినిమా షూటింగ్ విషయంలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ చేయబోతున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధిక భాషల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. “పుష్ప” మొదటి భాగం 2021 డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రపంచ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవటం జరిగింది. ప్రధానంగా అల్లు అర్జున్ తగ్గేదెలే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
అప్పటినుండి ఇప్పటివరకు ఈ డైలాగు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. చాలామంది సెలబ్రిటీలు “పుష్ప” సినిమా డైలాగులతో వీడియోలు కూడా చేయడం జరిగింది. “పుష్ప” సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అవార్డును ఇప్పటివరకు తెలుగులో ఎవరు అనుకోలేదు మొదట బన్నీ అందుకోవటం… హీస్టరీ క్రియేట్ చేసినట్లు అయింది. దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ‘గంగమ్మ తల్లి జాతర’ సీక్వెన్స్ మూవీకే హైలైట్ గా నిలుస్తుందట. 30 నిమిషాల సీన్ కోసం రూ.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. 35 రోజులపాటు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఓ ఫైట్ సీన్, పాట, ఎమోషనల్ సీన్ ఉంటుందని టాక్. ఈ సన్నివేశాలు మొత్తం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలో బన్నీ పుట్టినరోజు నేపథ్యంలో… ఆ సమయంలో స్పెషల్ వీడియో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.