Janasena: జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ క్రమంలో మొదటి విడతగా అయిదు నియోజకవర్గాలకు, ఆ తర్వాత రెండు నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించిన జనసేన .. తాజాగా ఇవేళ 11 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది.
మొత్తం 18 నియోజకవర్గాల అభ్యర్ధులను జనసేన ప్రకటించింది. ఆవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టింది. ఇక మచిలీపట్నం, కాకినాడ లోక్ సభ స్థానాలకు ఇప్పటికే జనసేన అభ్యర్ధులను ప్రకటించింది.
అసెంబ్లీ అభ్యర్ధులు..
పిఠాపురం – పవన్ కళ్యాణ్
నెల్లిమర్ల – లోకం మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
తెనాలి – నాదెండ్ల మనోహర్
నిడదవోలు – కందుల దుర్గేష్
పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు
యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
పి గన్నవరం – గిడ్డి సత్యనారాయణ
రాజోలు – దేవ వరప్రసాద్
తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం – పులవర్తి ఆంజనేయులు
నరసాపురం – బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
పోలవరం – చిర్రి బాలరాజు
తిరుపతి – ఆరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు – డా.యనమల భాస్కరరావు
BJP: ఆర్ఆర్ఆర్ కు బిగ్ ఝలక్ ఇచ్చిన బీజేపీ .. ఏపీలో బీజేపీ లోక్ సభ అభ్యర్ధులు వీరే