Pushpa 2: భారతీయ చలనచిత్రా రంగం ఎదురుచూస్తున్న సినిమా “పుష్ప 2”. 2021లో విడుదలైన “పుష్ప” మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన “పుష్ప” రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ లో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం, తగ్గేదేలే డైలాగ్, శ్రీవల్లి సాంగ్ స్టెప్స్… అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. “పుష్ప” సినిమాలో పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఊ అంటావా అనే ఐటెం సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అంతేకాదు “పుష్ప” సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతియా నటుడు అవార్డు సొంతం చేసుకున్నారు. “పుష్ప” భారతీయ చలనచిత్ర రంగంలోనే ఒక సంచలనం సృష్టించింది. ఇప్పుడు మొదటి సినిమాకి కొనసాగింపుగా “పుష్ప” సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా విడుదల చేయబోతున్నట్లు కూడా అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో “పుష్ప 2” నుంచి సంచలన అప్ డేట్ రావటం జరిగింది. విషయంలోకి వెళ్తే ఏప్రిల్ రెండవ తారీకు నుంచి అనగా రేపటి నుంచి మాస్ జాతర మొదలవుతుందని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
“ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది వేచి ఉండండి” అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ప్రకటన దేని గురించి ఉంటుందా అని అభిమానులు డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వారంలోనే.. ఏప్రిల్ 5వ తారీఖు హీరోయిన్ రష్మిక మందన బర్తడే. ఆ తర్వాత ఏప్రిల్ 8వ తారీకు హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు. దీంతో ఈ వారం నుండి వరుసగా “పుష్ప” సెకండ్ పార్ట్ అప్డేట్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే “పుష్ప” మొదటి పార్ట్ విడుదల చేసిన భాషల్లో కంటే మరిన్ని ఎక్కువ భాషల్లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్.