YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్ యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. బస్సు యాత్రతు జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోంది. మండుటెండలోనూ తమ అభిమాన నేత కోసం గంటల తరబడి వేచి ఉండి, తమ ఊరికి రాగానే పూల వర్షంతో స్వాగతం పలికి, గజమాలలతో సత్కరిస్తున్నారు. మహిళలు తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీ గజమాలతో ముఖ్యమంత్రికి కార్యకర్తలు స్వాగతం పలికారు.
రోడ్డుకు రెండు వైపులా దారిపొడవునా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంజీవపురం స్టే పాయింట్ వద్ద నుండి ప్రారంభమైన బస్సు యాత్ర బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల, పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుంది.
ఇక్కడ భోజన విరామం అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంది. కదిరి పట్టణం జనసంద్రంగా మారింది. దాదాపు రెండు గంటల పాటు కదిరి పట్టణంలో రోడ్ షో కొనసాగింది. సెల్ ఫోన్ లో టార్చ్ వెలిగిస్తూ ప్రజలు.. సీఎం జగన్ బస్సు యాత్రకు సంఘీబావం తెలియజేశారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెకు చేరుకుని రాత్రి బసకు వెళతారు.
AP Volunteers Resigned: ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు ..ఎందుకంటే..?