Bigg Boss Telugu Season 8: బిగ్బాస్ తెలుగు షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ద్వారా భారత దేశ వ్యాప్తంగా పాకుతుంది రియారిటీ షో. అందరిని అలరిస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేసే ఈ షోకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. విపరీతమైన టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంటూ కొన్ని సీజన్స్ను కంప్లీట్ చేసుకుంది ఈ షో. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ కి కాలు దువ్వుతుంది. ఇప్పుడు బిగ్బాస్ తెలుగు 8 కూడా రాబోతుంది. అయితే ఈ సీజన్ కు కార్తీకదీపం హీరో నిరూపమ్ పరిటాల రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై నేరుగా ఈయననే స్పందించాడు. గతంలో ఎప్పుడు లేనంతగా బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో రచ్చ సాగింది. విపరీతమైన టిఆర్పి కూడా వచ్చింది. ఇదే ఊపులో బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఓటిటి సీజన్ 2 ను ప్రారంభించబోతున్నారని పెద్ద ఎత్తున సమాచారం నడుస్తుంది. ఏప్రిల్ నెల నుంచే ఈ సీజన్ కూడా ప్రారంభం కానుందని అంత అనుకుంటున్నారు. కేవలం ఈ సీజన్ మాత్రమే కాదు.. ఇందులోకి వచ్చే కంటెస్టెంట్లు కూడా ఫైనల్ అయినట్లు టాక్ నడిచింది. గత సీజన్లో పాల్గొన్న భోలే, తెలుగులో ఓ రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రిచా పనయ్ ను తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు నడిచాయి.
అదేవిధంగా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన బర్రెల అక్క అలియాస్ శిరీష నటుడు భద్రం , డాన్స్ మాస్టర్ యశ్, సింగర్ పార్వతి లను ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా పరిచయం చేయనున్నట్లు అనేక ప్రచారాలు జరిగాయి. వీరందరినీ కన్ఫామ్ చేసినట్లు కూడా కొన్ని వార్తలు వినిపించాయి. కానీ బిగ్ బాస్ తెలుగు ఓటిటి సీజన్ 2 ఓ ఊసు లేకపోవడంతో.. అంతా ఆశలు వదిలేసుకున్నారు. చాలా రోజులుగా ఓటీటీ సీజన్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎటువంటి సమాచారం రాలేదు. ఇక ఓటిటి సీజన్ రాదని అంతా ఫిక్స్ అవుతున్న ఈ సమయంలోనే మరో కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. అందరూ కూడా ఖచ్చితంగా త్వరణం అనే బిగ్ బాస్ సీజన్ 8 చూడవచ్చు. కేవలం ఈ సీజన్ రావడమే కాదండోయ్..ఓ బుల్లితెర హీరో కూడా ఈ సీజన్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆయన మరెవరో కాదు కార్తీకదీపం సీరియల్ నిరూపమ్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఈ విషయాన్ని నేరుగా చెప్పుకొచ్చాడు. మీరు బిగ్ బాస్ కు వెళ్లే అవకాశం ఉందా అని యాంకర్ ప్రశ్నించగా.. ఏమో చెప్పలేం.. అప్పుడు వెళ్లాలనిపిస్తే వెళ్తానంటూ సమాధానమిచ్చాడు. కానీ శోభ శెట్టి, అమర్ వాళ్ళు లాగా తనకు అంత ఖచ్చితంగా వెళ్లాలనే కోరిక అయితే లేదని.. కానీ అవకాశం వస్తే మాత్రం ఆలోచిస్తానని పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను ఏం చేయాలనుకున్నా తన భార్య సపోర్ట్ ఉంటుందని.. దేనికైనా ఓకే చెప్పాలనుకుంటే వెంటనే ఓకే చెప్పగలుగుతానని కూడా వివరించాడు నీరుపమ్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ సీజన్లో నిరుపమ్ తో పాటు శోభా శెట్టి ని కూడా మరోసారి తీసుకోండి. వీరిద్దరూ కనుక ఈ షోలో పాల్గొంటే ఈ షో పక్క సూపర్ హిట్ అవుతుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.