Naga Panchami: మోక్ష ఏడుస్తూ ఉంటాడు. వైదేహి ఏంటి మోక్ష నువ్వు చెప్పేది నిజమా అంటుంది.మోక్షం అవునమ్మా నేను చెప్పేది నిజం పంచమికి మరో బిడ్డను కానీ అవకాశం లేదు ఇదే మొదటి బిడ్డ ఇదే ఆఖరి బిడ్డ కూడా అందుకని నేను ఈ బిడ్డను పోగొట్టుకోలేను నాన్న అనే పిలుపుకు నన్ను దూరం చేయకు అంటూ ఏడుస్తాడు మోక్ష . వైదేహి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తెల్లవారింది పంచమి ఒంటరిగా హాల్లో కూర్చుని ఉండడం జ్వాలా చిత్ర ఇద్దరు చూస్తారు జ్వాలా పంచమి దగ్గరికి వెళ్లి ఒక ఆట ఆడుకుందాం పద అంటూ చిత్రాన్ని తీసుకుని వస్తుంది.
చిత్ర ఏంటి పంచమి ఒంటరిగా కూర్చున్నావు అని అడుగుతుంది. జ్వాలా ఏం చేయమంటావ్ చిత్రం ఒకవైపు అత్తయ్య చూస్తేనేమో కడుపులో బిడ్డను తీయించుకో అంటుంది మరోవైపు మోక్ష చూస్తేనేమో ఏది ఏమైనా సరే నా బిడ్డను మాత్రం నేను చంపకోలేను అంటున్నాడు మరి ఏం చేస్తుంది ఒంటరిగా కూర్చోకపోతే ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు పాపం అంటుంది. చిత్ర అలా అయితే ఎలా పంచమి నీ కడుపులో బిడ్డ వల్ల ఇంట్లో ఎన్ని అబద్ధాలు జరుగుతున్నాయో తెలుసా నీ వల్లే కదా మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము మరి అలా జరిగితే అన్నా తమ్ముళ్ళని విడదీసిన పాపం నీకే తగులుతుంది
అది గుర్తుపెట్టుకో వాళ్లని విడదీయక పంచమి అత్తయ్య చెప్పినట్లుగా నువ్వు ఆ బిడ్డను తీయించుకో లేదంటే నీ భర్త ప్రాణాలకె ప్రమాదమని చెప్పారు కదా మరి అలాంటప్పుడు నీకు బిడ్డ ముఖ్యమా భర్త ముఖ్యమా మనకు కావలసింది ముఖ్యంగా భర్తనే కాబట్టి నువ్వు మోక్ష కోసం నీ బిడ్డను తీయించుకో అంటుంది చిత్ర. జ్వాలా ఇక నేను చెప్పేది చెప్పాము పంచమి నీ ఇష్టం ఎట్టి పరిస్థితిలో నువ్వు బిడ్డ గురించి ఆలోచించకు ముందు మోక్ష గురించి ఆలోచించు అని వెళ్ళిపోతారు. పంచమి వాళ్ళు చెప్పిన మాటలు విని ఆలోచిస్తూ కూర్చుంటుంది.
కట్ చేస్తే శబరి తన కూతురు మీనాక్షిని ఇద్దరూ అడవిలో ఉన్న గురువుగారి దగ్గరికి చేరుకుంటారు అక్కడి వాతావరణం మొత్తం ఆందోళనకరంగా మారిపోతుంది గురువుగారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి గురువుగారు శిష్యులు అందరూ గాయాలతో పడిపోయి శుభ లేకుండా కనిపిస్తారు అది చూసిన శబరి మీనాక్షి ఇక్కడ ఏదో అని అర్థం జరిగింది నేను ముందుగానే అనుకున్నాను మొదట గురువుగారు బిడ్డ గురించి చాలా మంచిగా చెప్పాడు ఒక్క నిమిషంలోనే గురువుగారికి మళ్ళీ గురువుగారు చాలా కోపంగా చూడడం గమనించాను వెంటనే అతని నోటి మాట తీరు మారిపోయింది చాలా భయంకరంగా మాట్లాడసాగాడు నేను అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని ఏదో దుష్టశక్తి గురువు గారిని ఆవహించి అలా చెప్పించి ఉంటుంది ఈ పని కూడా ఆ దుష్టశక్తిదె అయ్యుంటుంది మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే మనకే ప్రమాదం మనం వెళ్దాం పద అంటూ మీనాక్షిని తీసుకుని బయలుదేరుతుంది శబరి.
కట్ చేస్తే ఫణీంద్ర చాలా బాధతో కరాలి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు పనింద్రను చూసిన ఖరాలి ఏంటి పనింద్ర అంత దిగులుగా కనిపిస్తున్నావు ఏం జరిగింది నీ ఆందోళనకు కారణం ఏంటి అని అడుగుతుంది ఫణింద్ర ఏమీ మాట్లాడడు ఖరాలి ఇలా చూడు ఫణింద్ర ఒక విధంగా ఆ కుటుంబం మీద పంచమి మీద గెలిచాము గెలుపు గెలుపు మన వైపే చూపుతుంది ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉండాలి ఈ సంతోషానికి కారణం ఒక అందుకు నువ్వు కూడా పనింద్ర ఇందులో నువ్వు చేసిన మేలు కూడా ఉంది అని అంటుంది.
ఫణీంద్ర అదే కదా నేను అలాగేశ్వరుని అడ్డుకొని తనను గాయాలపాలు చేసినందుకు నాగదేవత ప్రత్యక్షమై నా శక్తులన్నీ తీసేసుకుంది ఇప్పుడు నేను ఒక సాధారణ మనిషిని నేను ఏ శక్తిని పొందలేను నాగదేవత మోక్షం ఇక నాకు ఎప్పటికీ కలగదు నేను ఎప్పటికీ నాగులోకం వెళ్ళలేను నేను ఇక్కడే సాధారణ మానవుడిగా జీవనం సాగించమని నాగదేవత నన్ను శపించి వెళ్ళింది అని చెబుతాడు ఫణీంద్ర. ఖరాలి బాధపడకు ఫణీంద్ర నీకు నేనున్నాను ఎలాంటి సమయంలోనైనా నీ వెంట నేనుంటాను నీ శక్తులు పోయాయని బాధపడకు నాగమణి నీ సంపాదించిన మరుక్షణం నేనేంటో చూపిస్తాను అంటుంది ఖరాలి