అమరావతి: రాష్ట్రంలో గోపాలమిత్రల సమస్యలపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 20 ఏళ్లుగా పని చేస్తూ నేడు ఆందోళన బాట పట్టిన గోపాలమిత్రల ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ విమర్శించారు.
ఇన్నాళ్లూ రైతులకు సహాయకారులుగా ఉంటూ పాడి పరిశ్రమాభివృద్ధికి గోపాలమిత్రలు ఎంతగానో కృషి చేశారని లోకేష్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా వాళ్ళ సేవలను ఉపయోగించుకుని ఇప్పుడు అర్హత లేవంటూ వాళ్ళను పక్కన పెడతారా, ఏళ్ల కొద్దీ సేవ చేసినా వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది లేకపోతే ఎలా అని లోకేష్ ప్రశ్నించారు.
అధికారం కోసం వీళ్ళందరికీ హామీలు ఇచ్చినప్పుడు లేని టెక్నికల్ పాయింట్లు ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాయని లోకేష్ ప్రశ్నించారు. గోపాలమిత్రల న్యాయమైన డిమాండ్ను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించి వెంటనే వారికి భరోసా కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు. లేకుంటే జగన్మోహనరెడ్డి ఇచ్చిన హమీలకు, మాటలకు విశ్వసనీయత లేదని ఒప్పకోవాలని లోకేష్ కోరారు.
అధికారం కోసం వీళ్ళందరికీ హామీలు ఇచ్చినప్పుడు లేని టెక్నికల్ పాయింట్లు ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాయి? గోపాలమిత్రల న్యాయమైన డిమాండ్లను మీరు పరిశీలించి, వెంటనే వారికి భరోసా కల్పించండి. లేదా మీ హామీలకు, మాటలకు విశ్వసనీయత లేదని ఒప్పుకోండి.#YSJaganFailedCM
— Lokesh Nara (@naralokesh) September 3, 2019