సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ ఇయర్ ప్రారంభంలోనే భారీ హిట్ ని దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించే లేటెస్ట్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. దానికి తోడు గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తాడన్న వార్త బయటకి రాగానే అటు ఫ్యాన్స్ లో ఇటు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.
అయితే ఈ సినిమా నుంచి అధికారకమైన ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అన్ని ప్రేక్షలు, ఫ్యాన్స్, సినీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అంతేకాదు మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందరి అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమాని ఘనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాని జి.ఎం.బి ఎంటర్టైన్మెంత్స్, మత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సర్కారువారి పాట అన్న టైటిల్ ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.