తన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ తోనే నేషనల్ అవార్డ్ పొందిన యువ సంచలనాత్మక దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. కొద్ది రోజుల క్రితం అతను ‘కప్పెల్లా’ అనే ఒక మలయాళం సినిమా ను పొగుడుతూ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ప్రకారం ఆయన తెలుగు ఇండస్ట్రీలో వచ్చే సినిమాలను మరియు వాటి స్క్రిప్టులను కించపరిచినట్లు కొంతమంది హీరోల ఫ్యాన్స్ భావించారు. ఒక హీరోనే టార్గెట్ చేస్తూ ఆయన ఆ హీరో కథల ఎంపికను కించపరిచారని వారి వాదన.
అయితే తరుణ్ భాస్కర్ ఎక్కడా ఏ హీరో పేరుని గాని ఏ సినిమా పేరు కానీ పొందుపరచలేదు. అయితే ఆ విషయంపై తరుణ్ భాస్కర్ పైన ట్విట్టర్లో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. చివరికి అతని ని విపరీతంగా దూషించిన మరియు ట్రోల్ చేసినా ఇద్దరు యువకులకి సైబర క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గచ్చిబౌలి సమక్షంలో ఫోన్ చేసి… తను పెట్టిన పోస్ట్ ను అపార్థం చేసుకోవద్దని మరియు ఇకపై సోషల్ మీడియా లో ఎటువంటి దూషణలు ఉండకూడదు అని అలాగే ట్రోల్ చేయడం ఒక మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలని తరుణ్ భాస్కర్ హితవు పలికినట్లు చెప్పాడు.
అయితే ముందు అతను చెప్పిన మాటలకు బాగానే స్పందించిన వారిద్దరూ ఆ తర్వాత అతని మొత్తం ఫోన్ సంభాషణను ఒక బెదిరింపు లాగా తీసుకొని చాలా దూకుడు గా రియాక్ట్ అయ్యారట. దీంతో నన్నే ట్రోల్ చేసి చివరికి నన్నే తప్పు పడతారా అన్నట్టు తరుణ్ భాస్కర్ వెంటనే వారిపై అఫీషియల్ గా సైబర్ క్రైమ్ వారికి కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ బెదిరింపు ఫోన్ కాల్ మరియు అతని గౌరవానికి భంగం కలిగించేలా చేసిన మాటలు, ఇక తప్పుడు ఆరోపణలు వ్యక్తిగత దూషణలు తో నిండిన మెసేజ్ లను ఆధారాలుగా ఇస్తూ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో కేసు ఫైల్ చేశాడు.
ఇక పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయాల్సి ఉంది. అయితే నెటిజన్లు మాత్రం ఇవన్నీ చాలా కామన్ అని… వారిని క్షమించి వదిలేయండి అని తరుణ్ భాస్కర్ కి కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మరి తరుణ్ భాస్కర్ వారిద్దరికీ సరైన శిక్ష పడేవరకు తగ్గేలా కనిపించడం లేదు.