గొప్ప విజయం సాధించిన భారత స్టార్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలను ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో ఈ జట్టు విజేతగా నిలిచింది. బీడబ్ల్యుఎఫ్ సూపర్ 1000 టైటిల్ సాధించిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడీ 21- 17, 21-18 తో ప్రపంచ ఛాంపియన్స్, రెండో సీడ్ ఆరోన్ చియా – సో వూయ్ యిక్ (మలేసియా) జంటను చిత్తు చేసింది.
నిరుడు బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకాలతో సత్తా చాటిన సాత్విక్ – చిరాగ్ జోడీ ఇప్పుడు తమ కేరీర్ లో మొదటి సూపర్ 1000 టైటిల్ తో అదరగొట్టింది. ఈ సందర్భంగా ఏపీ వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మా అందరినీ గర్వపడేలా చేశారు అంటూ ప్రశంసించారు.
Pawan Kalyan: కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్
My congratulations and best wishes to our very own Telugu boy @satwiksairaj and @Shettychirag04!
You’ve made us all very proud. pic.twitter.com/VLJxScA29n— YS Jagan Mohan Reddy (@ysjagan) June 19, 2023