టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపు కోసం.. వ్యయ ప్రయాసలకు ఓర్చుతున్నారు. రోజంగా ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతూనే ఉన్నారు. ప్రజలకు తానేం చేస్తానో వివరిస్తున్నారు. మార్పు కోసం అందరూ నడుంబిగించాలని కూడా చెబుతున్నారు. ఇది బాగానే ఉంది. అయితే.. ఇక్కడ ప్రధాన మరో కీలక విషయం కూడా.. తెరమీదికి వచ్చింది. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలని కేవలం ఏపీ నాయకులు.. ఏపీ టీడీపీ కార్యకర్తలు మాత్రమే అనుకోవడం లేదు.
పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు కూడా.. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలని బావిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, ఢిల్లీ, గుడ్గావ్ సహా.. పలు కీలక రాజధాని ప్రాంతాల్లో ఉంటున్న తెలుగు వారు.. ఏపీలో `చంద్రబాబు అనే నేను` – అన్న మాట కోసం.. ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇది కేవలం ఏపీలో ఉన్న టీడీపీ వారి వల్ల మాత్రమే కాకుండా.. ఉడతా భక్తిగా తాము కూడా.. చేతులు కలపాలని వారు నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో వారు రెండు రూపాల్లో ఏపీలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. 1) టీడీపీ కోసం.. కూటమి కోసం.. ప్రచారం చేయడం. 2) ఇప్పటి వరకు ఎన్నికలంటే.. ఆ.. ఏముందిలే! అనే నిర్లిప్తత ప్రదర్శించిన వారు.. ఇప్పుడు ఏపీలో జరగనున్న పోలింగ్ ప్రక్రియలో పాల్గొని చంద్రబాబుకు అనుకూలంగా ఓటేయా లని నిర్ణయించుకున్నారు. దీనికి గాను.. వారు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. దేశ విదేశాల్లోని తెలుగు వారు.. ఇప్పటికే కొందరు ఏపీకి చేరుకుని క్షేత్రస్థాయిలో సైలెంట్ ప్రచారం చేస్తున్నారు.
ఇక ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నవారు.. ఓటు వేసేందుకు వస్తున్నా రు. ఎంతగా వస్తున్నారంటే.. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య బస్సులు, రైళ్లు.. కిక్కిరిసిపోయేం తగా. ఈ నెల 11 నుంచి 14 మధ్య ఏపీకి వచ్చే రైళ్లు.. బస్సులు ఒక్కటంటే ఒక్కటి కూడా.. ఖాళీ లేదు. అంతేకాదు.. ప్రైవేటు ట్రావెల్స్ కూడా పూర్తిగా బుక్కయ్యాయి. అంటే.. ఎక్కడెక్కడ నుంచో అందరూ.. ఏపీకి క్యూ కడుతున్నారన్న మాట. అంతేకాదు…. చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు వస్తున్నామని వారు చెబుతుండడం గమనార్హం.