Mahesh Babu: ఇటీవలె సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పుష్ప విషయంలో నిరుత్సాహం చెందినట్లు వార్తలు వచ్చాయి. అనవసరంగా పుష్ప సినిమాని మహేష్ మిస్ చేసుకున్నాడని .. ఆ సినిమా రిజల్ట్ క్రియేట్ చేస్తున్న రికార్డులు గురించి విన్నప్పుడు అభిమానులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు టాక్. డైరెక్టర్ సుకుమార్ వాస్తవానికి ఈ సినిమా మహేష్ కోసం రాసుకున్నాడట. అంతే కాకుండా సంవత్సరం కూడా వెయిట్ చేయడం జరిగింది. కాని చివరిలో మహేశ్వర్ రిజెక్ట్ చేయడం వెంటనే బన్నీ ఒప్పుకోవటం తో పాటు పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించడం జరిగింది. కాగా ఒక దేశంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా పుష్ప మంచి ఆదరణ దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ మార్కెట్ మరో కుర్రహీరో కొల్లగొడుతున్నట్లూ సరికొత్త టాక్ వస్తుంది. ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ. పోకిరి, బిజినెస్ మేన్ ల ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో జనగణమన అనే సినిమా చేస్తున్నట్లు పూరి అధికారికంగా ప్రకటించారు.
అయితే చాలా సంవత్సరాలు గడుస్తున్నా గాని పూరికి మహేష్ కాల్షీట్లు ఇవ్వకపోవడంతో ఈ సినిమాని ఇప్పుడు విజయ్ దేవరకొండ తో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే పూరి దర్శకత్వంలో “లైగర్” చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతి సినిమా చేస్తుండగా .. పూరి “జన గణ మన” స్క్రిప్ట్ విజయ్ దేవరకొండ కి వినిపించటం జరిగిందట. స్టోరీ బాగా నచ్చటంతో.. రౌడీ విజయ్ దేవరకొండ వెంటనే ఒప్పుకోవటం జరిగింది అని ఫిల్మ్ నగర్ టాక్.
ఇక ఇదే సమయంలో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉండే హీరోలు థమ్స్ అప్ యాడ్ చేయడం తెలిసిందే. ప్రారంభంలో చిరంజీవి ఆ తర్వాత మహేష్ చేయగా ఇప్పుడు ఆ యాడ్ విజయ్ దేవరకొండ చేయటంతో మహేష్ మార్కెట్ నీ మెల్లమెల్లగా విజయ్ దేవరకొండ కొల్లగొట్టే స్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ మాస్ ఇమేజ్ రావడానికి ప్రధాన కారణం పూరి. పోకిరి వంటి సినిమాతో మహేష్ నీ మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరికి పూరి చేర్చాడు. ఈ తరుణంలో “జనగణమన” సినిమా మహేష్ మిస్ చేసుకోవడం పట్ల కూడా అభిమానులు నిరాశ చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.