Pooja Hegde: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటించిన చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కృష్ణంరాజు, సత్యరాజ్, భాగ్యశ్రీ కీలక పాత్రలను పోషించారు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మార్చి 11న విడుదలైంది.
అయితే తొలిరోజే ఈ మూవీ ఫ్లాప్ టాక్ను మూటగట్టుకుంది. కథ ప్రభాస్ మాస్ ఇమేజ్ కు సెట్ అవ్వకపోవడం, ఆకట్టుకోని కామెడీ, ప్రభాస్-పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా పడకపోవడం, స్లో నెరేషన్ సినిమాకు పెద్ద మైనస్లుగా మారాయి. దీంతో సినీ ప్రియులే కాదు అభిమానులు సైతం రాధేశ్యామ్ విషయంలో పెదవి విరిచారు.
కానీ, ప్రభాస్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కలెక్షన్లను మాత్రం బాగానే రాబడుతోంది. ఇకపోతే `రాధేశ్యామ్` ఫ్లాప్ టాక్పై పూజా హెగ్డే రియాక్ట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రాధేశ్యామ్ రిజల్ట్పై మాట్లాడుతూ.. `కొన్ని సినిమాలు ఓకే అనిపించినా బాక్సాఫీస్ దగ్గర బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగా పెర్ఫార్మ్ చేయకపోయినా చూసేందుకు బాగుంటాయి.
ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది..అలాగే జరుగుతుంది` అని చెప్పుకొచ్చింది. అంటే రాధేశ్యామ్ హిట్ టాక్ తెచ్చుకోకపోయినా చూడడానికి బావుంటుంది అనే విధంగా పూజా మాట్లాడింది. దీంతో ఇప్పుడు ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.