Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రతిక మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఆదివారం దసరా ఎపిసోడ్ నాడు హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన రితిక.. తన గేమ్ లో ఎటువంటి మార్పు రాలేదు. గతంలో నాలుగో వారంలోనే ఎలిమినేట్ కావడం జరిగింది. ఎదుట వ్యక్తి ఫీలింగ్స్ తో ఆడుకుంటూ.. కెమెరా ఫోకస్ తనపై ఉండే రీతిలో గేమ్ ప్లే చేసింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, యావర్ లపై సీరియస్ అయ్యి చాలా నెగెటివిటీ మూట కట్టుకుంది. అదే సమయంలో శివాజీ ఆట తీరు పట్ల బ్యాక్ బిచ్చింగ్ కూడా చేయడం జరిగింది. ఎంత ప్రేక్షకులు నాలుగో వారంలోనే రితికనీ ఇంటికి పంపించేశారు. అయితే ఉల్టా పుల్టా అన్న రీతిలో మరోసారి హౌస్ లోకి అదృష్టం కొద్దీ అడుగు పెట్టింది.
ఈ క్రమంలో రతిక బయట వాతావరణం మొత్తం తెలుసుకోవడంతో.. చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది. మేటర్ లోకి వెళ్తే ఈసారి సీజన్ లో అందరిలో కెల్లా ఆట తీరు విషయంలో శివాజీ ఆటపట్ల చాలా పాజిటివిటీ బయట క్రియేట్ అయింది. మనోడే టైటిల్ కొడతారని కూడా ఇప్పటికే చాలామంది ఫిక్స్ అయిపోయారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ఈ ముగ్గురు కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని చెబుతున్నారు. ఈ క్రమంలో రతిక బయట ఈ ముగ్గురికి ఉన్న పాపులారిటీ తెలుసు.. దీంతో ఇప్పుడు రెండోసారి హౌస్ లోకి వచ్చాక ఈ ముగ్గురిని అస్సలు వదలడం లేదు.
ఈ ముగ్గురితో ఫెవిస్టిక్ మాదిరిగా అతుక్కుపోయింది. పల్లవి ప్రశాంత్ నీ మల్లు అర్జున్ అని.. యావర్ నీ అన్వర్ అంటూ తెగ పొగడ్తలతో ముంచెత్తుతుంది. అంతేకాదు అటు ఇటు చూసి శివాజీ కాలపై కూడా దండం పెట్టేయడం జరిగింది. బయట ఈ ముగ్గురికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఈ గ్రూపులో ఉంటే కచ్చితంగా టాప్ ఫైవ్ లో బెర్త్ కన్ఫామ్ అని రతిక గేమ్ ఆడుతున్నట్లు ఆడియన్స్ భావిస్తున్నారు.