Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎనిమిదో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సందీప్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో సంచలన స్టోరీ పెట్టడం జరిగింది. విషయంలోకి వెళ్తే 9వ వారంలో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రెడ్ టీం వర్సెస్ ఎల్లో టీం లుగా ఇంటి సభ్యులను విభజించడం తెలిసిందే. అయితే టాస్క్ లో భాగంగా అందరూ మాట్లాడుకుని.. పల్లవి ప్రశాంత్ నీ కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించారు. అందరూ తీసుకునే నిర్ణయం పట్ల ప్రశాంత్ ఎంతగానో బాధపడ్డాడు. భోరున ఏడవటం జరిగింది. ఆ సమయంలో హౌస్ మేట్స్ చాలామంది ప్రశాంత్ నీ ఓదార్చడం జరిగింది.
శివాజీ కూడా ప్రశాంత్ కి ధైర్యం చెబుతూ ఇదేమి శాశ్వతం కాదు ఈ ఒక్క వారమే కదా నువ్వు టాస్క్ లు ఆడకపోయినా ఏం పర్లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా పట్టుదలతో గేమ్ ఆడు ఏడవకు..అని తెలపడం జరిగింది. అయితే ప్రశాంత్ నీ కెప్టెన్సీ టాస్క్ లో పక్కన పెట్టడాని సందీప్ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ రూపంలో రియాక్ట్ అయ్యారు. “పాపం రా.. ప్రశాంత్ మంచి ప్రేయర్. వాడిని ఎందుకు ‘డెడ్’ చేశారు ?. ప్రశాంత్ ఉంటే గేమ్ ఆడలేరా .. భయమా ?.. స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో గేమ్ ఆడండి.
స్ట్రాంగ్ ప్లేయర్లను బయటకు పంపి ఆడితే గేమ్ లో కిక్ ఉండదు. అవును.. నన్ను అలాగే బయటకు పంపారు. నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని” అంటూ రెండు చేతులు జోడించిన ఎమోజీ షేర్ చేశాడు సందీప్. ప్రస్తుతం సందీప్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. మరోపక్క తొమ్మిదవ వారంలో కెప్టెన్సీ టాస్క్ లో ఎట్టకేలకు అమర్ దీప్ కెప్టెన్ కావటం జరిగింది. హోరాహోరీగా వీర సింహాలు… గర్జించే పులులు మధ్య జరిగిన టాస్క్ లలో చాలామంది పోటీపడ్డారు. కానీ చివరకు అమర్ దీప్ గెలవడం జరిగింది.