Ennenno Janmala Bandam: జరిగింది నేను చెప్తాను యువర్ హానర్ అని మాళవిక బోన్ లోకి వస్తుంది, ఆరోజు నైట్ జరిగిన విషయం అంతా చెప్తుంది మాళవిక. అభిమన్యు ని నమ్మి యశోదర్ పై పగ తీర్చుకోవాలని అనుకున్న నేను, వేద పై కూడా రెండుసార్లు హత్య ప్రయత్నం చేశాను, నేను హత్యకు గురైనట్లుగా చిత్రీకరించి యశ్ ని నేరస్తుడిగా నిరూపించి శిక్ష పడేలా చేయాలనుకున్నా అభిమన్యు నేను బ్రతికుంటే తనకు ప్రమాదం అని నన్ను హత్య చేయడానికి ప్రయత్నించాడు, అక్కడి నుంచి తప్పించుకున్న నన్ను నేను అప్పటి వరకు నా శత్రువు అనుకుంటున్నా డాక్టర్ వేదస్విని నన్ను కాపాడారు కోర్టు వారు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను అని మాళవిక చెప్తుంది.
అనుహ్యమైన మలుపులు తిరిగినప్పటికీ ఒక నేరస్తుడు శిక్ష నుండి తప్పించుకోవడం కంటే ఒక్క నిర్దోషికి శిక్ష వేయటం మహా పాపం అని నమ్మే వ్యవస్థ గౌరవం కాపాడినందుకు నిర్దోషి అయిన తన భర్త యశోదర్ని కాపాడుకోవడంలో సాహసించినందుకు అసలు నిజాలు బయట పెట్టినందుకు డాక్టర్ వేదస్వినిని కోర్టు హృదయపూర్వకంగా అభినందిస్తుంది కరుడుగట్టిన నేరస్తులకు మించి దారుణమైన నేరాలకు పాల్పడిన అభిమన్యుని వెను వెంటనే అరెస్టు చేయవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోర్టు ఆదేశిస్తుంది తప్పనిసరి పరిస్థితులలో నేరాన్ని స్వయంగా అంగీకరించిన హత్యాయత్నం చట్టాన్ని వక్రీకరించే చర్యల్లో భాగమైనందుకు మాళవికను పోలీసు వారు తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ నిమిత్తం అభిమన్యు మాళవికలను కోర్టు ముందు హాజరు పరచవలసిందిగా కోరుతున్నాను అని జడ్జి గారు చెప్తారు. కోర్టు ముగుస్తుంది. పోలీస్ వారు మాళవికను తీసుకెళ్తారు.
యశ్ బయటికి రాగానే వేద హగ్ చేసుకుంటుంది. అది చూసి ఏసిపి, నీలాంటి వాళ్లు ఈ సొసైటీ కి చాలా అవసరం, యశోదర్ నువ్వు చాలా లక్కీ అని చెప్తుంది. చాలా చాలా థాంక్స్ అండి అని వేద చెప్తుంది. ఈ థాంక్స్ సరిపోదు నాకు ఏం కావాలో అడగనా, మొన్న స్టేషన్లో బంధాల గురించి చెప్పారే ఇంకొకసారి చెప్పండి అని అడుగుతుంది.ప్రేమ అనురాగాలు మానవ సంబంధాలకు మించినవి ఈ ప్రపంచంలో ఏవి లేవు అని వేద చెప్తుంది. ఇద్దరూ కలిసి చెప్పండి అని ఏసిపి అడుగుతుంది. మా బంధం ఈ బంధం ఎన్నెన్నో జన్మల బంధం అని ఇద్దరు కలిసి చెప్తారు. కట్ చేస్తే అభిమన్యుని అరెస్ట్ చేస్తారు, కంగ్రాట్యులేషన్స్ యశోదర్ అండ్ వేదస్విని అని చెప్తాడు చాలా ప్రౌడ్ గా ఉంది కదూ అని అంటాడు అభి. అవును అని చెప్తాడు యశ్.ఎందుకు మీరు గెలిచినందుకా నేను ఓడినందుకా అని అభి అంటాడు. ఎందుకేంటి అభిమన్యు న్యాయం ధర్మం గెలిచినందుకు అరాచకం ఓటమిపాలైనందుకు అని వేద అంటుంది.
ఈ ప్రపంచాన్ని నడిపించేవి రెండే రెండు ఒకటి డబ్బు రెండోది అధికారం, డబ్బుంటే అధికారాన్ని కొనొచ్చు అధికారం ఉంటే డబ్బు సంపాదించవచ్చు అని అభి అంటాడు. చాలా చాలా పొరపాటు పడుతున్నావు,ఈ ప్రపంచాన్ని నడిపించేది ప్రేమ న్యాయం ధర్మం, డబ్బే జీవితం అనుకుంటే బంధాలు ఉండవు డబ్బు అధికారంతో ప్రేమ కొనలేవు ధర్మాన్ని న్యాయాన్ని కొనలేవు అని వేద చెప్తుంది. సరే మీరు ఇలాగే ఉండండి నేను వెళ్లి తిరిగి వస్తాను అని అంటాడు అభి. ఒక మంచి మనిషిగా తిరిగి వస్తారని ఆశిస్తాము అని వేద చెప్తుంది. మనుషులను సృష్టించింది ఆ దేవుడే పులులను సృష్టించింది ఆ దేవుడే పంజా పిసరడం పులి ధర్మం కాదనడం అధర్మం అని అభి అంటాడు.
మనిషి మనిషిలా బ్రతకడం మృగం మృగంలా జీవించడం సృష్టి ధర్మం మనిషి మృగంలా కావాలి అనుకుంటే సృష్టించిన భగవంతుడు కూడా క్షమించడు అని వేద చెప్తుంది. అది విన్న అని నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే,యష్ ఇంటికి వస్తాడు.ఖుషి ఇంక ఆదిత్య కలిసి యశ్ కి వెల్కమ్ చెప్తారు, యశ్ వచ్చి ఇద్దరిని హాగ్ చేసుకుంటాడు, వాళ్ళు చూపించే ప్రేమను భరించలేక తన ఆనందం తో ఆనందపాష్పాలు వస్తాయి.అందరు కలిసి లోపలికి వెళ్తుంటే ఖుషి ఆగండి అంటుంది. లోపయికి వెళ్లి హారతి తీసుకొచ్చి ఇస్తుంది. అందరి దిష్టి పోవాలని ఎవరి కళ్ళు పడకోడదు అని తీస్తుంది.అందరు వచ్చి అది చూస్తారు. వేద ఇంక యశ్ లోపలికి వస్తారు.