Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఆమె. తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు సినిమాతోనే ఆమె హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఫస్ట్ మూవీతోనే నటిగా తన సత్తా ఏంటో నిరూపించుకుంది. యూత్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ అగ్ర తారగా గుర్తింపు పొందింది. అలాగే తమిళ ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించి తనదైన ముద్ర వేసింది. దాదాపు దశాబ్దంన్నర కాలం నుంచి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆమెకు నార్త్ లో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆ కరాటే కిడ్ మరెవరో కాదు సమంత రుతు ప్రభు. నేడు ఆమె బర్త్డే. ఈ సందర్భంగా సమంత గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నైలో సమంత జన్మించింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగువారు కాగా.. తల్లి నినెట్ ప్రభు మలయాళీ. సమంతకు జోనాథ్ మరియు డేవిడ్ అనే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. సమంత తమిళం మరియు తెలుగు రెండు భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీ నుండి సమంత కామర్స్లో డిగ్రీ అందుకుంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ ముగిసే సమయానికి ఆమె మోడలింగ్లోకి ప్రవేశించింది.
సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం సమంత పలు ఈవెంట్స్ కు వెలకమ్ చెప్పే అమ్మాయిగా పని చేసింది. 3గంటలు నిల్చొని గెస్ట్లకు వెల్కమ్ చెబితే రూ.800 నుండి రూ.1000 వరకు ఇచ్చేవారు. అదే సమంత తొలి సంపాదట. గౌతమ్ వాసుదేవ్ మీనన్ యొక్క తెలుగు చిత్రం ఏ మాయ చేసావే తో సమంత 2010లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ మూవీతోనే సమంతకు బ్రేక్ వచ్చింది. ఉత్తమ నటిగా పలు అవార్డులు అందుకుంది.
ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ద్వారా నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో రాజి అనే బోల్డ్ క్యారెక్టర్ లో నటించి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. పుష్ప ది రైజ్ లో ఐటెం సాంగ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయింది.
నటిగాగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతున్న సమంత.. గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా కెమెరాకు దూరంగా ఉంటోంది. ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునే పనిలో పడింది. సమంత పర్సనల్ విషయానికి వస్తే..కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే సమంత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన తొలి సినిమా హీరో అయిన నాగచైతన్య ను ప్రేమించి పెళ్లాడింది. 2017లో గోవా వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కానీ వీరి బంధం విడాకులతో ముగిసింది. పెళ్లయిన నాలుగేళ్లకే సమంత నాగచైతన్యతో తెగదెంపులు చేసుకుంది.