Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ మనం ఇలా మళ్లీ కలుస్తామని నేను అసలు అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది శ్యామ్ అని రుక్మిణి అంటుంది. నేను కూడా అనుకోలేదు రుక్మిణి కానీ నీ మీద ప్రేమ ఉందని ఇన్నాళ్ళకైనా తెలుసుకున్నాను అందుకే మళ్ళీ మనిద్దరం ఒకటయ్యాం అని శ్యామ్ అంటాడు. శ్యామ్ కొబ్బరిబోండం తాగుదామా అని రుక్మిణి అంటుంది. శ్యామ్ వెళ్లి రెండు కొబ్బరి బోండాలు తీసుకొని వస్తాడు. అక్కడే రాదని గమనించిన రుక్మిణి ఒక కొబ్బరి బొండం పడేస్తుంది. ఎందుకు రుక్మిణి ఒకటి పడేసావ్ అని శ్యామ్ అంటాడు. నీ దగ్గర ఒకటి ఉంది కదా శ్యామ్ దాంట్లో రెండు స్ట్రాలు వేసుకొని తాగుదాం అని రుక్మిణి ఇంకో స్ట్రా తీసుకొని ఇద్దరు కలిసి ఒకే బొండంలో నీళ్లు తాగుతారు. అది చూసిన రాదా బాధపడుతుంది.
వెళ్దామా అని శ్యామ్ అంటాడు. శ్యామ్ కొబ్బరి బొండాల అతనికి డబ్బులు ఇస్తాడు. చిల్లర తేవడానికి కొబ్బరి బోండాలు అతను పక్కకి వెళ్తాడు.శ్యామ్ ఒక ముద్దు పెట్టొచ్చుకదా అని రుక్మిణి అడుగుతుంది.ఆ మాట విన్న రాదా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎవరైనా చూస్తే బాగోదు రోడ్డుమీద కదా అని శ్యామ్ అంటాడు. చూడవలసిన వాళ్ళు చూస్తే చాలు మనల్ని ఎవరు చూస్తారు శ్యామ్ అని రుక్మిణి అంటుంది. అయినా సరే నాకు ఇక్కడ నచ్చట్లేదు అని శ్యామ్ అంటాడు. అయితే ఇంటికి వెళ్ళాక పెడుదువులే అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే,రాధా ఏడుస్తూ ఇంటికి రావడంతో ఏమైంది రాధా అని మధుర అడుగుతుంది. రాధా మధుర ని హగ్ చేసుకుని ఏడుస్తుంది. అత్తయ్య మీరు చెప్పినట్టు నిజంగానే ఆయన మారిపోయాడు ఆయన అక్కని ప్రేమగా చూసుకుంటున్నాడు ఆయన అక్కని ప్రేమిస్తున్నాడు అని రాధా బాధపడుతుంది.
ఏంటి రాధ నువ్వు చెప్పేది వాడు ఎలాంటి వాడో నీకు తెలియదా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని మధుర అంటుంది.శ్యామ్ ఎలాంటి వాడో ఇప్పుడే అర్థమైంది అత్తయ్య తను అక్కని ప్రేమిస్తున్నానని కిరణ్ తో చెబుతూ ఉండగా నేను నా చెవులతో విన్నాను ఇప్పుడు రోడ్డుమీద ఓకే బోండాల్లో రెండు స్ట్రాలేసుకుని చిలుక గోరింకల్లా ప్రేమగా తాగుతున్నారు ఆయన మారిపోయారు అత్తయ్య నేనంటే ప్రాణం అన్నవాడు అక్క నీ ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని రాధా అంటుంది. రుక్మిణి అక్క దగ్గర డబ్బులు ఉన్నాయని అక్కని ప్రేమిస్తున్నాడు నా దగ్గర ఏమీ లేదని నన్ను వదిలేశాడు
ఈ పరిస్థితుల్లో మీరు లేకపోతే నేనేమైపోయే దాన్ని అత్తయ్య అని రాదా అంటుంది. వాణి పూర్తిగా మర్చిపోరాదా నువ్వెందుకు అమ్మ ఏడుస్తున్నావ్ నీకు మేమున్నాం కదా అని మధుర ఓదారుస్తుంది. కట్ చేస్తే, భిక్షు నేను మా ఆయన సీజర్ ల్యాండ్ హనీ ముని కి వెళ్తున్నం మేము వచ్చేసరికి రాదని చంపేసేయ్ అని రుక్మిణి అంటుంది. మీరు హనీమూన్ కి వెళ్తే రాదని నేను చంపడం ఏంటి మేడం అని భిక్షు అంటాడు. రాదని కాపాడుతుంది మాయనే అందుకే రాదని కాపాడుకుండ తీసుకొని వెళ్ళిపోతున్నాను చంపేసే అని రుక్మిణి అంటుంది.
అలాగే మేడం అని భిక్షు అంటాడు. కట్ చేస్తే,రాధా మనం ఇక్కడే ఉంటే వాడిని గుర్తుకు తెచ్చుకొని నువ్వు బాధపడుతూ ఉంటావు అందుకే మనం ఇక నుంచి వేరే ఊరు వెళ్లిపోదాం అని ధనంజయ్ అంటాడు. వాళ్ల కోసం మనం ఎందుకు మామయ్య వేరే ఊరు వెళ్లిపోవాలి నేను వాళ్ళని పూర్తిగా మరిచిపోతాను అసలు వాళ్ల గురించి ఆలోచించను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుని మీకోసం ఆలోచిస్తాను మా అక్క పడగొట్టిన మ్యారేజి బ్యూరో ని మళ్ళీ స్టార్ట్ చేస్తాను మిమ్మల్ని ఏ లోటు రాకుండా చూసుకుంటాను పండు ని చూడడం కోసమేనా ఇదే ఊళ్ళో ఉంటాను వాళ్లకి భయపడి మనం వెళ్లిపోవడం ఏంటి అత్తయ్య అని రాధా అంటుంది. నువ్వు అలా ధైర్యంగా ఉంటే మేమెందుకు భయపడతామమ్మా అని ధనంజయ్ అంటాడు. కట్ చేస్తే,
రాధా రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడికి శ్యామ్ వచ్చి ఆగు రాదా నీతో మాట్లాడాలి అని అంటాడు.ముందు నన్ను మీరు వదిలిపెట్టండి అని రాదా అంటుంది. నేను నీ భర్తనే కదా రాధా ముట్టుకుంటే తప్పేంటి అని శ్యామ్ అంటాడు. ఇప్పుడు మీరు మా అక్క భర్త నా భర్త కాదు మీరు దూరంగా ఉంటే మంచిది అని రాదా అంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది నీకు తెలియదా రాదా నన్ను అర్థం చేసుకున్నావు కదా మళ్లీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్ నువ్వంటే నాకు ప్రాణం రాదా అని శ్యామ్ అంటాడు. అందుకేనా మీరిద్దరూ రోడ్డు మీద ఓకే బొండంలో రెండు స్ట్రాలు వేసుకొని తాగుతున్నారు అని రాధా అంటుంది..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది