Malli Nindu Jabili February 10 2024 Episode 569: చూడు శంకరమ్మ నేను వసుంధర అత్త ఇంటికి వచ్చినప్పుడుని చూపులు అనుమానంగా ఉన్నాయి నేనే అరవింద్ ని హత్య చేశానని అంటూ నీ చూపులు నాకు అనిపిస్తున్నాయి అని గౌతమ్ అంటాడు. ఎందుకలా అనిపించింది నీకు అరవింద్ ని హత్య చేసిన అతను నాలాగే ఉన్నాడా అని గౌతమ్ అంటాడు. అవును బాబు కొంచెం మీలాగే అనిపిస్తున్నాడు కానీ అందుకే నిజం చెప్పలేకపోతున్నాను అని శంకరమ్మ అంటుంది. చూడు శంకరమ్మ అన్నీ పోగొట్టుకొని నేను ఇప్పుడు రోడ్డు మీద పడ్డాను ఇప్పుడు నన్ను అన్యాయంగా కేసులు ఇరికిస్తే ఇంకా నా జీవితం నాశనం అయిపోతుంది
మనిషిని పొలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంట నువ్వు బాగా ఆలోచించుకొని సాక్ష్యం చెప్పు లేదంటే నువ్వు నా జీవితాన్ని అన్యాయం చేసిన దాని అవుతావు అని గౌతమ్ అంటాడు. ఇప్పటికే నా పరిస్థితి ఏం బాగోలేదు ఇంకా నాకు పోయేది ఏమి లేదు కానీ నా మీద అన్యాయంగా కేసు పెట్టిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అని గౌతమ్ అంటాడు.
వసుంధర అత్త గురించి నీకు సరిగ్గా తెలియదు శంకరమ్మ ఎలాగైనా సరే నన్ను ఇరికించాలనుకుంటుంది కానీ నువ్వు ఆ తప్పు చేసి తప్పు చేసిన దానిల మిగిలిపోకు అరవింద్ చావులో నువ్వే ప్రత్యక్ష సాక్షి వి అని గౌతమ్ అంటాడు. సరే బాబు ఇంకా లేట్ అయితే వసుంధర అమ్మకి అనుమానం వస్తుంది నేను వెళ్తాను అంటూ శంకరమ్మ భయపడుతూ వెళుతుంది. కట్ చేస్తే, మల్లికి శరత్ ఫోన్ చేస్తాడు. ఏంటి నాన్న ఫోన్ చేసావ్ ఎలా ఉన్నారు అక్క ఎలా ఉంది అని మల్లి అడుగుతుంది. నేను ఇంటి దగ్గర లేను మల్లి బయట ఉన్నాను కానీ సహాయం చేస్తానని నిన్ను అడిగిన వద్దంటున్నావు గౌతమ్ ని అడిగిన వద్దంటున్నాడు మీకు ఏ సహాయం చేయకూడదా నేను అని శరత్ అంటాడు. నాన్న నన్ను క్షమించండి మేమొ ఇప్పుడు బాగానే ఉన్నాం ఆయనకి మంచి ఉద్యోగం వచ్చింది అని మల్లి అంటుంది. ఏం జాబ్ చేస్తున్నాడు గౌతమ్ నీకు చెప్పాడా అని శరత్ అంటాడు. ఏ ఆఫీసులో తెలియదు కానీ ఏదో టీవీ ఛానల్ అని చెప్పాడు నాన్న అని మల్లి అంటుంది.
నేను జాబ్ చేస్తానన్న ఆయన వద్దంటున్నారు అత్తయ్య కూడా అదే చెప్పారు నాన్న నన్ను బాగా చూసుకుంటున్నాడు నేను హ్యాపీగా ఉన్నాము అని మల్లి అంటుంది. వాళ్ళ అమ్మకి మల్లి కి అబద్దం చెప్పాడు అంటే వాళ్ళని కష్టపెట్టొద్దనుకుంటున్నాడు బాబు గారు ఎలాగైనా సరే మనం వాళ్లకు హెల్ప్ చేయాలి అని మీరా అంటుంది. సరేలే ఏదో ఒకటి ఆలోచిద్దాం అని శరత్ అంటాడు. కట్ చేస్తే, ఇంట్లో మాట్లాడుకోవడం కుదరట్లేదని కారులో షికారుకు వెళ్లి ఏ పార్కు వెళ్లారు మీరు అంటుంది. ఎక్కడికి వెళ్ళాము చెప్పేదాకా తాగుతావా సుందర అని శరత్ అంటాడు.
మీరు వెళ్ళగానే గౌతమ్ వచ్చి గొడవ చేసాడు నా చెయ్యి నరికి నా చేతిలో పెడతాను అన్నాడు అని వసుంధర అంటుంది.భార్యని కొట్టావని వచ్చి అడిగాడేమో అని శరత్ అంటాడు. నీ భార్యని తిట్టాడు కదా నువ్వు వెళ్లి అడుగు అని వస్తుందర అంటుంది.నన్నంటే నువ్వెందుకు వెళ్లి అడుగుతావులే అని వసుంధర అంటుంది.ఎన్నైనా అనుకో నేను వెళ్లి అడగను అని శరత్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, గౌతమ్ ఇంటికి వచ్చి మల్లి కి ఏమైందని అడుగుతాడు.
గోడ తగిలి గాయమైందండి అని మల్లి అంటుంది. నీలిమ అంతా చెప్పింది అందుకే వసుంధరని బెదిరించి వచ్చాను అని గౌతమ్ జరిగిందంతా చెబుతాడు. అలా ఎందుకు చేశారండి అని మల్లి అంటుంది. ఈరోజు పైన పడుకుందామా వెన్నెల కాస్తుంది అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, మాలిని అరవింద్ గుర్తుకు తెచ్చుకునే బాధపడుతూ వందేళ్లు నాతో కలిసి ఉంటానని అప్పుడే వెళ్ళిపోయావా అరవింద్ అని ఏడుస్తుంది. నిన్ను నాకు దూరం చేసిన వాని వదిలిపెట్టను అని మాలిని అంటుంది. కట్ చేస్తే, గౌతమ్ మల్లి పడుకోడానికి పైకి వెళ్తారు. మల్లి కి పూలు పెడతాడుగౌతమ్.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది