Nindu Noorella Saavasam:పర్వాలేదు నేను మేడం తో మాట్లాడడానికి వెళుతున్నాను నిన్ను కూడా డ్రాప్ చేస్తాను కారు ఎక్కు అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ మారు మాట్లాడకుండా వెళ్లి కార్లో కూర్చుంటుంది. రాథోడు ఇందాక నేను తీసుకెళ్తాను అంటే నడిచి వెళ్తాను అన్నావ్ ఇప్పుడేమో కార్లో కూర్చున్నావు అని మనసులో అనుకుంటాడు. అమరేంద్ర భాగమతిని తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే, ప్రిన్సిపాల్ మేడం తన రూమ్ లో మనోహర్ని కూర్చోబెట్టుకొని అసలు అంజలిని ఇంట్లో ఏరా ఎలా భరిస్తున్నారండి తనకు డిసిప్లేన్ లేదు చదువు లేదు అని నోటికొచ్చిందల్లా తిట్టేస్తుంది. వినలేక అరుంధతి చెవులు మూసుకుంటుంది. మనోహరీ ఈవిడ ఎంతసేపు చెప్తుంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఘోర వచ్చి ఆత్మ ఇక్కడే ఉంది అటు బయటకి తీసుకురా అని సైగ చేస్తాడు. ఒక్కసారి అటూ ఇటూ ఆత్మ ఎక్కడ ఉందని మనోహరీ భయపడుతూ చూస్తుంది. ఏంటి మను ఎటు చూస్తున్నావు అని అరుంధతి అంటుంది.
మేడం మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అంజలి చేసింది కొంచెం అయితే మీరు గోరంత చేసి చెప్తున్నారు ఏంటి అని అరుంధతి అంటుంది. మేడం నేను చూసుకుంటాను నాకు చెప్పారు కదా అని మనోహరీ అంటుంది. సరే మీరు నాతో ఏదో మాట్లాడ్డానికి వచ్చాను అన్నారు కదా ఏంటి చెప్పండి అని మేడం అంటుంది. ఇంతలో లంచ్ బెల్ అవుతుంది. పిల్లలు లంచ్ చేయడానికి వస్తారని అరుంధతి వెళ్ళిపోతుంది. ఇంటర్ బెల్ లో మొదలుపెట్టి లంచ్ దాకా క్లాస్ పీకారా ఎందుకు వచ్చాను నేనే మర్చిపోయాను వస్తాను మేడం అని మనోహరీ బయటికి వస్తుంది. ఆత్మ ఎక్కడ ఉంది అని ఘోర నీ అడుగుతుంది మనోహరి. బెల్లు కొట్టగానే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది అని ఘోర చెప్తాడు. ఈరోజు ఎలాగైనా సరే దాన్ని బంధించాలి అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, అమరేంద్ర భాగమతిని తీసుకొని స్కూల్ లోకి వస్తాడు. రామ్మూర్తి కార్ ని చూడగానే గేటు ఓపెన్ చేస్తాడు. కారు ఆగగానే రామ్మూర్తికి దగ్గు స్టార్ట్ అవుతుంది ఆ దగ్గును విని ఎవరు అని అరుంధతి అటు ఇటు వెతికి చూస్తుంది ఎవరు కనిపించకపోయేసరికి నిలబడి చూస్తుంది.
Nindu Noorella Saavasam Today Episode January 04 2024 Episode 124 Highlightsఏమైంది మిస్సమ్మ అని అమరేంద్ర అంటాడు. ఏమీ లేదు పిల్లలకు లంచ్ టైం అయింది వెళ్లి బాక్స్ ఇచ్చేసి వస్తాను అని భాగమతి వెళ్తుంది. ఇంతలో రామ్మూర్తి మంచినీళ్లు తాగి బయటికి వస్తాడు. రామ్మూర్తిని చూసిన అమరేంద్ర తన దగ్గరికి వెళ్లి ఇందాక దగ్గింది మీరే కదా మీకు దగ్గర ఎందుకు వస్తుంది అని అడుగుతాడు. ఇది మామూలుగా వచ్చే దగ్గే బాబు అని రామ్మూర్తి అంటాడు. అయినా సరే మీకు ఇంత వయసు వచ్చింది కదా అండి ఎండలు ఎక్కువ పని చేయకూడదు ఈ వయసులో వచ్చే ఏ జబ్బు అయినా సరే మీకు ఎక్కువే అవుతుంది మంచి హాస్పిటల్ చూపించుకోండి అని అమరేంద్ర అంటాడు. ఈ దగ్గు కోసమే బాబు నా కూతురు నాన్న చాకిరి చేస్తుంది లక్షలతో కూడుకున్న పని కదా అయినా వేరే మార్గం కూడా చూస్తుంది అని రామ్మూర్తి అంటాడు. నీకు మీ అమ్మాయి తప్ప ఇంకెవరూ లేరా అని అమరేంద్ర అంటాడు. ఒక బంధం ఉండేది బాబు నాకు తెలియకుండానే దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు నేను నా కూతురు తప్ప మాకు ఇంకెవరూ లేరు అని రామ్మూర్తి బాధపడతాడు. మేము లేమా అని అమరేంద్ర అంటాడు. రామ్మూర్తి కన్నీళ్ళతో అమరేంద్ర వంకా చూస్తాడు. అదేంటండి మీకు మేము లేమా ఆరోగ్యపరంగా నైనా సరే నేను చూసుకుంటాను పొద్దున్నే చెప్పాను కదా ఏ హెల్ప్ కావాలన్నా మీ అమ్మాయి కోసమే కాదు నీ కోసం కూడా చేస్తాను మీరు పెద్దవారు ఎక్కువగా ఎండలో నిలబడకండి ఇక్కడ నీడన కూర్చోండి అని అమరేంద్ర రామ్మూర్తిని నీడలో కూర్చోబెడతాడు. అతని మంచితనాన్ని చూసి రామ్మూర్తి ఆనందంతో నోట మాట రాక ఆనంద భాష్పాలు కురిపిస్తాడు. కట్ చేస్తే,పిల్లలు అలా బయటికి వస్తూ ఉండగా చూడండి రా లూజర్స్ వస్తున్నారు నిన్న కాక మొన్న వచ్చారా లేదో అప్పుడే స్కూల్లో లీడర్స్ అయిపోయి పెత్తనాలు ఎలా చేస్తారంట అని స్టూడెంట్స్ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ మాటలు విని అంజుకి ఎక్కడలేని కోపం వచ్చి వాళ్ళ మీదికి పరిగెత్తుతుంది. ఆకాష్ ఆనందు అంజు వద్దు అని తీసుకొచ్చి ఒకచోట కూర్చోబెడతారు. అందుకే నేను వద్దన్నాను ఇలాంటి అవమానాలు పడాల్సి వస్తుంది అని అమ్ము అంటుంది.
గోరంత లేదు పొట్టి మిరపకాయలాగా ఎగిరెగిరి పడుతుంది వాళ్లను కూడా ఆలోచించాలి కదా అని అరుంధతి అంటుంది. అక్క ఇప్పుడు అదంతా ఎందుకు లంచ్ బ్రేక్ అయిపోతుంది మనం తినేద్దాం అని ఆనంద్ అంటాడు. ఇక్కడ చాలామందికి ఆనందంగా ఉన్నట్టుంది వాళ్ళు తింటారులే నాకు ఆకలిగా లేదు అని అమృత అంటుంది. కట్ చేస్తే, ఇంతలో భాగమతి పిల్లల దగ్గరికి వస్తుంది.ఏంటి అమ్ము అన్నం తినకుండా వెళ్ళిపోతున్నావు అని భాగమతి అడుగుతుంది.నాకు ఆకలిగా లేదు మిత్రమా వద్దు అని అమృత అంటుంది. ఏం జరిగింది అని భాగమతి అడుగుతుంది. ఇందాక మేం బయటికి వస్తుంటే స్టూడెంట్స్ అంతా ఎక్కిరించారు అందుకే అక్క అన్నం వద్దని బాధపడుతుంది అని ఆకాష్ చెప్తాడు. ఇంతలో భాగమతి అరుంధతిని చూసి అక్క నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. చూసేసిందా అని అరుంధతి టెన్షన్ పడుతూ చెప్పాను కదా మిస్సమ్మ ఇక్కడే మా పిల్లలు కూడా చదువుకుంటున్నారని అందుకే వచ్చాను అని అరుంధతి అంటుంది. అవునా ఏరి మీ పిల్లలు అని భాగమతి అడుగుతుంది.
ఎవరిని చూపించాలి అని అటు ఇటు చూసి ఒక అమ్మాయిని చూపిస్తుంది. అదేంటి అక్క మొన్న చూపించింది ఈ అమ్మాయిని కాదు కదా అని భాగమతి అంటుంది. అలా భాగమతి గాల్లో మాట్లాడుతూ ఉండడం చూసి పిల్లలు షాక్ అయిపోతారు. ఈ కాలం పిల్లలు చాలా తొందరగా మారిపోతున్నారు మిస్సమ్మ అని అరుంధతి అంటుంది. మిస్సమ్మ ఇందాకడి నుంచి చూస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అంజలి అడుగుతుంది. అదేంటి మన పక్కింటి ఎవరితో మాట్లాడుతున్నాను ఈవిడే ఆవిడ అని అటువంటి చూపెడుతుంది. పిల్లలు అటు ఇటు చూస్తారు అక్కడ ఎవరు కనిపించరు కానీ ఇంతలో ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుతూ వచ్చి అక్కడ కూర్చుంటుంది. అయ్యో మిస్సమ్మ ఆవిడ మన పక్కింటి ఆవిడ కాదు మన అవతలి బజారు అని అమృత అంటుంది.
అయినా సరే మన పక్క వీదే కదా అని భాగమతి అంటుంది. సరే అమృత ఎందుకు అన్నం తినను అంటున్నావు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ల ముందే నువ్వు గెలిస్తే కదా అప్పుడు కిక్ ఉంటుంది వాళ్ళేదో ఎగతాళి చేశారని నువ్వు డ్రాప్ అయిపోతే ఎలా ఇంకా పాటిస్పెండ్ చేయనేలేదు అప్పుడే నువ్వు భయపడి పోతున్నావు ఇక నిన్ను చూసి ఈ పిల్లలు ఏం నేర్చుకుంటారు భాగమతి అంటుంది. ఈ మిస్సమ్మ పిల్లలతో నేను ఎలా మాట్లాడుతాను అచ్చం అలాగే మాట్లాడుతుంది అని అరుంధతి అనుకుంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది