Nindu Noorella Savasam: ఈవిడ ప్రేమ నా చావుకు వచ్చేటట్టు ఉంది నా కాలు చెయ్యి విరగకపోతే ఈపాటికి లేచి టీ పెట్టి అందరికీ టిఫిన్ తయారు చేసేదాన్ని కానీ నాకు ఇప్పుడు మంచినీళ్లు ఇచ్చే దిక్కులేదే అని నీలా ఏడుస్తుంది. ఇప్పుడేమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని మనోహరి అంటుంది. అమ్మగారు నేను లేవలేక పోతున్నాను నాకు పొద్దున్నే మంచి నీళ్లు తాగే అలవాటు ఉంది కొన్ని నీళ్లు ఇవ్వండమ్మా అని నీలా అంటుంది. అంటే ఏంటే నిన్ను నా రూమ్ లో పడుకోబెట్టుకునేది కాక నీకు సేవలు చేయాలా అని మనోహరి అంటుంది. అమ్మగారు ఈ దెబ్బలు ఎవరివల్ల తాగిలయి మీ వల్లనే కదా అని నీలా అంటుంది.అంటే నీకు దెబ్బ తగిలింది కాబట్టి ఇంట్లో పని చేయడానికి ఎవరూ లేరు పొద్దున్నే టీ పెట్టి అందరికి ఇస్తాను అప్పుడు అందరు ఇంప్రెస్స్ అయిపోయి నన్ను అమరేంద్ర పెళ్లి చేసుకుంటాడు అని మనోహరి అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. అప్పటికే కిచెన్ లో భాగమతి టీ పెడుతూ ఉంటుంది.ఇంత పొద్దున్నే ఇక్కడ ఏం చేస్తున్నావు మిస్సమ్మ అని మనోహరి అంటుంది.
నీలాకి దెబ్బలు తగిలాయి కదా తను లేచి టీ పెట్టలేదు కాబట్టి నేను అందరి కోసం టీ పెడుతున్నాను అని భాగమతి అంటుంది. నీకు చెప్పిన పని సరిగ్గా చెయ్యి నువ్వు ఈ టీ పెట్టడాలు టిఫిన్ చేయడాలు లాంటివి పెట్టుకోకు పిల్లని లేపి స్కూల్ కి రెడీ కమ్మని చెప్పు అని మనోహరి అంటుంది. అలాగే అని భాగమతి పిల్లలకు తీసుకెళ్తుంది మనోహరి అమరేంద్రకు టీ తీసుకెళ్లి గుడ్ మార్నింగ్ అమరేంద్ర ఇదిగో టీ తాగు అని అంటుంది మనోహరి. టీ నువ్వే పెట్టావా అని అమరేంద్ర అంటాడు.అవును నీలా కి దెబ్బలు తగిలయి కదా ఇంట్లో పని చేయడానికి ఎవరు లేరు అందుకే నినే టీ పెట్టి తీసుకు వచ్చాను అని మనోహరి అంటుంది. రాథోడ్ కి చెప్పి ఇంకెవరినైనా పనికి పెట్టమంటాను అవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు మనోహరీ ఇప్పటికే పిల్లల కోసం నా కోసం చాలా చేశావు ఇక నువ్వు ఈ పనులు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు అని అమరేంద్ర అంటాడు.
నీకోసం ఏదైనా సరే ఇష్టంగా చేస్తాను అమరేంద్ర అని మనోహరి అంటుంది. ఏమన్నావు అని అమరేంద్ర తన వంక చూస్తాడు. ఏమీ లేదు ఆంటీ కోసం పిల్లల కోసం నీ కోసం ఏదైనా సరే ఇష్టంగా చేస్తాను అని అంటున్నాను అమర్ అని మనోహరి కవర్ చేసుకుంటుంది. సరే నువ్వు వెళ్ళు పిల్లల్ని తీసుకుని నేను స్కూల్ కి వెళ్తాను అని అమరేంద్ర అంటాడు. నేను కూడా వస్తాను అమర్ పేరెంట్స్ గా పిల్లల దగ్గర ఉండాలి కదా అని మనోహరి అంటుంది. ఆ మాట అనగానే అమరేంద్ర తన వైపు ఒక లుక్ ఇస్తాడు. అంటే ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి ఆరు కూడా లేదు కదా ఆరు స్థానంలో నేను వస్తానని అంటున్నాను అని మనోహరి అంటుంది. ఆరు స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు అని అమరేంద్ర అంటాడు. సారీ అమర్ పొద్దున్నే ఆరు ని గుర్తు చేశాను అని మనోహరి అంటుంది.
మర్చిపోతే కదా ఒకరు గుర్తు చేయడానికి నేను బ్రతికున్నంత వరకు అరుంధతిని మరిచిపోలేను తన జ్ఞాపకాలను వదిలిపెట్టను తను నా వెంటే ఉంటుంది నేను బ్రతికి ఉన్నంత వరకు అని అమరేంద్ర అరుంధతిని తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే భాగమతి టీ తీసుకోవచ్చి ముగ్గురికి ఇస్తుంది. అయ్యో మిస్సమ్మ నాటి మిస్సైంది అమ్మ అని అంజు అంటుంది. అంజుపాపా టి తెస్తే కదా మిస్సయ్యి ఏది అని భాగమతి అంటుంది. అంటే నాకు కావాలనే టీ తీసుకురాలేదా మరి వాళ్ళకి ఎందుకు తెచ్చావు అని అంజు అంటుంది. వాళ్లు పొద్దున్నే లేచి చదువుకుంటున్నారు కాబట్టి టీ తెచ్చి ఇచ్చాను అని భాగమతి అంటుంది. నిద్దట్లో ఉన్న నన్ను లేపి తీస్తే తాగను అన్నానా అని అంజు అంటుంది లేచి మాత్రం తాగి ఏం చేస్తావు అని అమృత నవ్వుతుంది. చూస్తున్న మీరు చేసే పనులన్నీ గమనిస్తూనే ఉన్నా మిస్సమ్మ నువ్వు కూడా గుర్తుపెట్టుకో నువ్వు నన్ను అవమానిస్తున్నావు అని అంజు అంటుంది. అది సరే కానీ స్కూల్ కి వెళ్ళాలి రెడీ అవ్వండి అని భాగమతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే గుప్తాగారు నీలాని పలకరిద్దామని లోపలికి వెళ్తూ ఉంటాడు.
అడ్డంగా రాథోడ్ నిలబడి ఏంట్రా పెళ్లయినా కొత్త అల్లుడు ఇంట్లోకి సిగ్గుపడుతూ వెళ్ళినట్టు నువ్వు వెళ్తున్నావు అని రాథోడ్ అంటాడు నాకు నచ్చిన వాళ్ళని పలకరిద్దామని వెళుతున్నాను అని గుప్తా అంటాడు. రేయ్ నీకు నచ్చిన వాళ్ళు ఎవర్రా అని రాథోడ్ అంటాడు. నాతోటి పనిచేసే బాలిక తనకు దెబ్బలు తగిలాయి కదా పలకరిద్దామని వెళుతున్నాను అని గుప్తా అంటాడు. తనను నువ్వేమీ పలకరియోద్దు కానీ చెట్లకు నీళ్లు పోయి అని రాథోడ్ అంటాడు. చెట్లకు నీళ్లు పోసాను కారు తుడిచాను అన్ని పనులు అయిపోయాక నెలవంకను చూద్దామని వెళుతున్నాను అని గుప్తా అంటాడు. కట్ చేస్తే గుప్తా నీలా దగ్గరికి వెళ్లి నీలా ఎలా ఉన్నావు ఇలా దెబ్బలు తాగే కింద పడిపోయావే అని బాధపడతాడు. పలకరించడానికి ఎవరు దిక్కులేరే అని బాధపడుతున్న నాకు మీరు వచ్చి ఓదార్పునిచ్చారు అని నీలా అంటుంది. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ సైగలు చేసుకుంటూ ఉంటే రాథోడ్ వచ్చి మురుగా ఏమిటి ఈ వింత కన్నులతో చూడలేకపోతున్నానే అని రాథోడ్ అంటాడు.
కట్ చేస్తే పిల్లలు అందరూ వచ్చేసినట్టేనా ఇక స్కూల్ కి వెళ్దామా అని అమరేంద్ర అంటాడు.రెడీ అయిపోయo డాడీ పొద్దున్నే లేచి బాగా చదువుకొని ఎగ్జామ్ బాగా రాయాలని పూజ కూడా చేసి బొట్టు పెట్టుకున్నాను చూడు డాడీ అని అంజు అంటుంది. ఈరోజు రాసి ఎగ్జామ్ కి జనరల్ నాలెడ్జి ఉంటే సరిపోతుంది చదువుకోవడం దేనికి మీ అమ్మ ఎలాగూ లేదు నిన్ను వెనకేసుకు రావడానికి ఇలాంటి పిచ్చి పనులన్నీ మానేయి అని అమరేంద్ర అంటాడు. చ డడి మెచ్చుకుంటాడని ఇలా చేస్తే అయినా సరే తిట్లు తప్ప లేదే అని అంజు తన మనసులో అనుకుంటుంది. అమర్ నేను కూడా వచ్చేసాను వెళ్దాం పదండి అని మనోహరి అంటుంది. ఆగండి నేను కూడా వస్తున్నాను అని భాగమతి అంటుంది. నువ్వెందుకు ఇంట్లో పనులు చూసుకో నేను అమర్ పిల్లలతో వెళ్తాము అని మనోహరి అంటుంది.
తను పిల్లలకు కేర్ టేకర్ గా వచ్చిందమ్మా పిల్లలతో లేకుంటే ఎలా అని అమరేంద్ర వలన అన్న అంటాడు. అవును మనోహరి నువ్వు ఇంట్లోనే ఉండి వంట పని చేసుకో పొద్దున టీ బాగా పెట్టావు అని అమరేంద్ర అంటాడు. పొద్దున టీ పెట్టింది మనోహరి కాదురా మిస్సమ్మ పెట్టింది అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. అయినా సరే నువ్వు వంట పని చేసుకో మనోహరి అని అమరేంద్ర అంటాడు. చ ఎంత చేసినా అమర్ ఆ మిస్సమ్మనే వెనకేసుకు తిరుగుతున్నాడేంటి అని మనోహరి తన మనసులో అనుకుంటుంది. రాథోడ్ కారు సిద్ధం చెయ్ మేమందరము వస్తున్నాము అని అమరేంద్ర అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది