బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. హౌస్ లో కొంచెం క్లోజ్ గా ఉండేవారిని ఇద్దరి ఇద్దరు గా నిలబెట్టి ఎలిమినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగించారు బిగ్ బాస్. కాగా ఆ తర్వాత మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో “కొంటె రాక్షసుడు మంచి మనుషులు” అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ బిగ్బాస్ నిర్వహించారు. దీంతో కొంటె రాక్షసుల రాజ్యంలో అరియనా, అవినాష్, అఖిల్, మెహబూబ్, హారిక టీం గా ఉన్నారు. మిగతా ఇంటి సభ్యులు మంచి మనుషులు టీం లో ఉన్నారు. ఇదేమి లో రాక్షసుడు మంచి మనిషి గా మారితే… రావణుడి బొమ్మలోని పది తలలో రెండిటిని మొదలు పెట్టాల్సి ఉంటుంది.
ఈ విధంగా రాక్షసులు ముగ్గురు మంచి మనుషులుగా మారితే… మనుషుల టీం గెలిచినట్లు. అయితే ఈ గేమ్ లో అరియనా… ఓ రేంజ్ లో నిజమైన రాక్షసి లాగా పర్ఫామెన్స్ చేసింది. నోయాల్ పై గుడ్డు పగలగొట్టిన అతడు కిక్కురు మనలేదు. రాక్షస గ్రూపు మనుషులు టీం పై ఓ రేంజులో విరుచుకుపడి నానారకాలుగా చిత్రహింసలు పెట్టినా, దాడి చేసిన… మనుషుల టీం ఏ విధంగాను స్పందించలేదు.
రాక్షస గ్రూప్ సభ్యులకు…. మంచి మంచి మాటలు చెప్పి మనుషులుగా మార్చడానికి నీతులు చెబుతూ వచ్చారు. ఇదిలా ఉండగా స్విమ్మింగ్ పూల్ లో ఉన్న బంతిపూలు దండలు గా 50 చేయాలని మనుషుల గ్రూపుకి టాస్క్ ఇవ్వడంతో…ఆ టాస్క్ కంప్లీట్ చేయడంతో రాక్షస టీమ్ లో ఉన్న అఖిల్ మంచి మనిషిగా మారాడు. ఇంకా రకరకాల టాస్క్ లతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులను ఆడించాడు.