ఏపీలో నేటి నుంచే ఆన్లైన్ లో ఇంటర్ ప్రవేశాలు. కరోనా నేపథ్యంలో కళాశాలల్లో ప్రవేశాలు నిలిచిపోయాయి. దీనివలన ముఖ్యంగా పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు,వారి తల్లితండ్రులు ఇంటర్ లో వారి అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణం లో ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ లో ఇంటర్ ప్రవేశాలను చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏపీలోని ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు తొలిసారిగా ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు 2020-21 సంవత్సరానికి గాను విద్యార్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.ఈ ప్రక్రియను అక్టోబర్ 21ఈ రోజు నుంచి అమలులో ఉంటుందన్నారు.ఏపీలో రెండేళ్ల ఇంటర్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు ఇందుకోసం ap inter admissions 2020-direct link ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆన్లైన్ విధానంలో ప్రవేశాల ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ httpsbie.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 29న తేదీ సాయంత్రం 5 గంటల లోగా విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా. ఓసీ బీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ ౨౦౦, ఎస్సీ ఎస్టీ విభాగాలకు చెందిన విద్యార్థులు రూ 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు . విద్యార్థులకు సందేహాలు ఏమైనా ఉంటె 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయ్యవచ్చని చెప్పారు. అడ్మిషన్ కోసం కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యార్థులు ఎవరైనా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోతే సమీపంలో ఉన్న వార్డు లేదా గ్రామ సచివాలయానికి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎటువంటి సర్టిఫికెట్స్ లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి టెన్త్ హాల్ టికెట్ నంబర్, కుల ఆదాయ ధృవీకరణ పత్రం నంబర్లు మాత్రమే అవసరం ఉంటుంది..నిజానికి ఈ అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ లోనే ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే అనివార్య కారణాలతో వాయిదా వేశారు. విద్యార్థులు ఎక్కడకి వెళ్లకుండా సులువుగా ఆన్లైన్ , దగ్గరలోని సచివాలయం లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు.