Janasena: ఏపీలో జనసేన పోటీ చేయని స్థానాల్లో ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను స్వతంత్ర అభ్యర్ధులకు ఎన్నికల అధికారులు కేటాయిస్తున్నారు. దీనిపై కూటమి నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఈసీ అధికారులు నిబంధనలను అనుసరించి ఎన్నికల గుర్తులను అభ్యర్ధులకు కేటాయింపు చేశారు.
ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయంపై జనసేన ఇవేళ హైకోర్టును ఆశ్రయించింది. గాజు గ్లాస్ గుర్తును ఇతర అభ్యర్ధులకు కేటాయించకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో జనసేన కోరింది. తాము పొత్తులో భాగంగా రెండు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని, మిగిలిన చోట పొత్తులో ఉన్న బీజేపీ, టీడీపీ అభ్యర్ధులకు మద్దతుగా ఉన్నామని జనసేన కోర్టుకు వివరించింది.
జనసేన పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మరో వైపు ఇదే అంశంలో తమ వాదనలు వినిపించేందుకు టీడీపీ కూడా అనుబంధ పిటిషన్ వేసింది. దీనిపై ఎన్నికల కమిషన్ మాత్రం 24 గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దీంతో జనసేన పిటిషన్ పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
Tenth Results: తెలంగాణ ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి