Samantha: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఎంతో మానవత్వం ఉన్న మనిషి అని అందరికీ తెలుసు. పెళ్లికాకముందు నుంచే ఆమె ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. జంతువుల పట్ల అదేవిధంగా మనుషుల పట్ల ఆరోగ్యపరంగా అనేక అవగాహన కార్యక్రమాలు తన అపోలో హాస్పిటల్స్ ద్వారా తెలియజేసింది.
మెగా కోడలిగా చిరంజీవి కుటుంబంలో అడుగుపెట్టాక కూడా ఆమె నిరంతరం ఎక్కడో అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉంటది. పేదవాళ్ళకి మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామందికి ఉపాసన హెల్ప్ చేయడం జరిగింది. ఈ రకంగానే హీరోయిన్ సమంతకి కూడా ఉపాసన హెల్ప్ చేసిందట.
విషయంలోకి వెళ్తే గత ఏడాది అక్టోబర్ నెలలో సమంతకి మయోసైటీస్ అనే వ్యాధి ఉందని బయటపడింది. ప్రాణాంతకరమైన ఈ వ్యాధి బారిన పడటంతో ముందు సమంత.. తన పరిస్థితిని మొత్తం అపోలో హాస్పిటల్స్ సీఈవో అయినటువంటి ఉపాసనాకి తెలియజేసిందట. దీంతో సమంతకు ఉపాసన చాలా ధైర్యం చెప్పి వెంటనే తన తాతయ్య గారికి ఈ విషయం తెలియజేసి విదేశాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు అందరికీ రికమండేషన్ చేయడం జరిగిందంట. ఈ రకంగా ఉపాసన రికమండేషన్ కారణంగా సమంత ఎంతో మంచి ట్రీట్మెంట్ ముందుగానే అందుకొని.. ప్రాణాంతకరమైన మయోసైటీస్ వ్యాధి నుండి బయటపడిందట.
సమంత రామ్ చరణ్ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అదే బాండింగ్ తో ఉపాసనాకి కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడటంతో సమంత పరిస్థితి మొత్తం తెలుసుకొని ఉపాసన బాధ్యత తీసుకొని.. సహాయం చేసిందట. ఈ రకంగా కీలకమైన సమయంలో సమంతకి మెగా కోడలు చేసిన సాయం వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తెలియజేస్తుందంటూ..అసలైన స్నేహమంటే ఇది, కష్ట సమయంలో సరిగ్గా ఆదుకుంది అంటూ ఈ వార్తపై నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాదు ఇటీవల సమంతా అమెరికా వెళ్ళటానికి కారణం కూడా ఉపాసన అని టాక్. గతంలో మయాసైటిస్ వ్యాధికి తీసుకున్న ట్రీట్మెంట్.. చాలా పవర్ఫుల్ కావడంతో.. సమంత చాలా శక్తిని కోల్పోయింది. ఈ క్రమంలో అమెరికాలో సమంత పూర్తి రికవరీ కావడానికి అక్కడ డాక్టర్లను అపోలో హాస్పిటల్స్ టీం రికమండేషన్ చేసినట్లు టాక్.