Bigg Boss Telugu 5: 9వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ అదరగొట్టే రీతిలో జరిగింది. క్రీమ్ పుయి… నామినేషన్ లో వెయ్.. అనే టైటిల్ తో జరిగిన నామినేషన్ ప్రక్రియ లో కేక్ క్రీమ్ తీసుకుని ఎవరినైతే ఎలిమినేషన్ కి నామినేట్ చేయాలని అనుకుంటారా సభ్యుడు సదరు వ్యక్తికి క్రీమ్ మొహం పై పూయాలి. ఈ క్రమంలో చాలా మందికి ఊహించనివిధంగా మాట మాట పెరిగి.. వాగ్వాదం లో నువ్వానేనా అన్నట్టుగా వాదించుకున్నారు. ముఖ్యంగా 9 వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం లోనే సన్నీ, మానస్, కాజల్ ఒక గ్రూపు గా మళ్లీ కొనసాగే టట్లు ఈ నామినేషన్ ప్రక్రియలో వ్యవహరించడం జరిగింది.
గత వారంలోనే ఈ ముగ్గురు గ్రూప్ గా ఏర్పడి… హౌస్ లో రచ్చ రచ్చ చేశారు. వేటాడు వెంటాడు టాస్క్ లో… సన్నీ ఏకంగా సంచాలకుడిగా ఉన్న జెస్సీ పై రెచ్చిపోయాడు. ఇక ఇదే తరుణంలో మానస్ కూడా… వారెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అన్నదానిపై హౌస్ లో డిస్కషన్ జరిగిన సమయంలో చాలామంది ఇంటి సభ్యుల పై.. రెచ్చగొట్టే రీతిలో మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఇదే రీతిలో 9వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో మిగతా ఇంటి సభ్యులపై ఈ ముగ్గురు.. భారీగా డైలాగులు వేయడం జరిగింది. శ్రీరామ్ … మానస్… సన్నీ ల మధ్య గొడవ చోటుచేసుకుంది. కొసమెరుపేమిటంటే షణ్ముఖ్ జస్వంత్ ఊహించని రీతిలో పింకీని నామినేట్ చేయడం.. హౌస్ మొత్తానికి హైలెట్ గా మారింది.
ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్
ఎవరూ ఊహించని రీతిలో పింకీ… కెప్టెన్ షణ్ముక్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. మొత్తంమీద చూసుకుంటే 9వ వారం లో ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం 10 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. 8 వారాలు ఆట ముగియడంతో ఇంటిలో ఎనిమిది మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ తరుణం లో 9వ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా ఉంది. దాదాపు సగం సీజన్ పూర్తి కావడంతో.. ఇంటిలో సభ్యులు గేమ్ పైన గట్టిగా కాన్సెంట్రేషన్ పేట్టడం జరిగింది. దీంతో సీజన్ ఫైవ్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ట్రోఫీ.. గెలిచే గేమ్ ఇప్పటి నుండి స్టార్ట్ అయిందని.. బయట ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.