YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. గత నెల 28వ తేదీ నుండి రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్న జగన్ ఇవేళ (గురువారం) ప్రచారానికి బ్రేక ఇచ్చారు.
పోలింగ్ కు ఇంకా 11 రోజులు మాత్రమే గడువు ఉండటంతో ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. సర్వే నివేదికల్లో వెనుక బడి ఉన్న నియోజకవర్గాల నేతలను ఈ రోజు జరిగే సమావేశానికి పిలిచారు.
ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అత్యధిక స్థానాలను గెలుపే లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగన్ కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్ధులు వెనకబడి ఉండటాన్ని గమనించి వారితో ఇవేళ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారుట. అందుకే ఇవేళ ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారని అంటున్నారు.
YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్