Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా అని పారు నిందలు వేస్తూ ఉంటుంది. శివ నారాయణ పారు మీద ఫైర్ అవుతాడు. సాయంగా ఇస్తానంటేనే తీసుకొని మనిషి ఇలాంటి పని చేస్తుందని ఎలా అనుకుంటున్నావు అని మండిపడతాడు. శౌర్య వచ్చి ఏమైంది తాత ఎందుకు గ్రానీని తిడుతున్నావు అని అడుగుతుంది. ఇక శౌర్యతో ఈ విషయం గురించి మాట్లాడొద్దని సుమిత్ర మరియు కార్తీక్ చెబుతారు. కానీ పారు మాత్రం ఒప్పుకోదు. మీ ఇంట్లో డైమండ్ నక్లీస్ ఉందా అని అడుగుతుంది. నక్లీస్ ఎక్కడైనా చూసావా అని అంటే చూసానని చెబుతుంది శౌర్య. ఎక్కడ అంటే మా ఇంట్లోనే మా అమ్మ బ్యాగ్ లో ఉందని చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇప్పటికైనా అర్థమైందా ఎవరు దొంగతనం చేశారో అని పారు అరుస్తుంది. అలాంటి నక్లీస్ మన బ్యాగ్ లో ఉండడం ఏంటని దీప శౌర్యని అడుగుతుంది. ఉందమ్మా నేను చూశాను అంటూ చెబుతుంది శౌర్య. మన బ్యాగ్ లో నక్లీస్ ఉండటం ఏంటి? నువ్వు పెట్టావా అని దీప కోపంగా అడుగుతుంది.
నువ్వు తీయకుండా నీ బ్యాగ్ లోకి ఆ నక్లిస్ ఎలా వచ్చిందని పారు నిలదీస్తుంది. ఎందుకు మా అమ్మని తిడుతున్నారని శౌర్య అంటుంది. మీ అమ్మ నక్లీస్ బ్యాగ్ లో పెట్టుకుంది గా అంటే అని నేను చెప్పానా అంటుంది. మరి ఎవరు చెప్పారని కార్తీక్ అడిగితే శౌర్య బంటుని చూపిస్తూ అంకుల్ పెట్టారని చెప్తుంది. నేను ఇంట్లో కూర్చుని డ్రాయింగ్ వేసుకుంటే ఆ అంకుల్ వచ్చాడని అంటుంది. గ్రానీ నువ్వు చెప్పినట్లే జరిగింది మా అమ్మ బ్యాగ్ లో నక్లీస్ పెట్టింది అంకుల్ అంటుంది. అమ్మమ్మ అమ్మ కోసం సర్ప్రైజ్ ఇచ్చిందనుకుని నేను చెప్పలేదు. కార్తీక్ నేను చెప్పేది కరెక్ట్ కదా అంటుంది. సరే నువ్వు వెళ్లి నక్లీస్ తీసుకురా ఈలోపు అంకుల్ కి థాంక్స్ చెప్తానని కార్తీక్ కోపంగా అంటాడు. బంటుని పట్టుకుని చితకబాదుతాడు. మంచితనంతో నిజాయితీగా బతుకుతున్న మనిషి మరియు ఆ నిజాయితీని చంపాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ పని నువ్వు చేసావా? నీతో ఎవరైనా చేయించారా అని బంటు చంపలు పగలగొడతాడు కార్తీక్. పారిజాతం తన పేరు చెప్పొద్దని సాయిగా చేస్తుంది.
తానే చేశాను అని బంటు ఒప్పుకుంటాడు. ఒక నిండా పడిన తరువాత అది నిజం కాదని నిరూపించుకోవడం ఎంత కష్టమో తెలుసా? నమ్మకం ప్రాణం కంటే ఎంతో గొప్పది. ఒకసారి పోతే తిరిగి రాదు. వెళ్లి ఆ మనిషి కాళ్లు పట్టుకుని క్షమించమని అడుగు అని బంటుని కార్తీక్ తిడతాడు. క్షమించమని అడుగుతాడు బంటు. పారు ఏమి తెలియనట్టు ఎలాంటి ఎదవ పని చేశావేంటని తిడుతుంది. బంటు నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని దశరథ చెబుతాడు. మళ్లీనా కంటపడితే దొంగతనం చేశావని చెప్పి జైల్లో పెట్టిస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఏగా అప్పుడే శౌర్య నక్లిస్ తీసుకుని వస్తుంది. ఇదిగో ఇదే ఆ నక్లిస్ మా అమ్మ బ్యాగ్ లో పెట్టిన నక్లీస్ అని ఇస్తుంది. మాట రాయి లాంటిది మనసు అర్థం లాంటిది. ఆలోచించకుండా వేసే రాళ్లు అద్దాన్ని వాటి అందాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని చెప్పి కార్తీక్ నక్లీస్ జ్యోత్స్న చేతిలో పెడతాడు. అలా వారి మధ్య కొంత సంఘటన జరుగుతుంది. అనంతరం .. జ్యోత్స్న, పారు తప్ప ఇంట్లో అందరూ తనని నమ్ముతున్నారని దీప మనసులో అనుకుంటుంది.
అదేమీ లేదని చెప్తుంది. జ్యోత్స్న తో ఏమైనా గొడవ జరిగిందా అని సుమిత్ర కార్తీక్ ని అడుగుతుంది. అదేమీ లేదని మామూలుగానే ఉన్నామని కార్తీక్ చెప్పేసి వెళ్లిపోతాడు. పారు కాంచన కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏమైందని శ్రీధర్ అడుగుతాడు. పిన్ని ఎప్పుడు లేనిది కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. దీప విషయంలో ఏదో గొడవ జరిగిందంట.. జ్యోత్స్న నీ సపోర్ట్ చేయకుండా తనని సపోర్ట్ చేశాడట. జ్యోత్స్న బాగా బాధపడుతుంది. పిన్ని మాటలు నమ్మడం కరెక్టేనా? అంటుంది. అంతే చెప్పిందా ఇంకేమైనా చెప్పిందా అని అడుగుతాడు. దీపతో కార్తీక్ చనువుగా ఉంటున్నాడని చెప్పిందని కాంచన చెబుతుంది. ఇది మళ్ళీ కార్తీక్ ని అడగకూడదు వాడు బాధపడతాడు. ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం వీలైనంత త్వరగా కార్తీక్ మరియు జ్యోత్స్న లా పెళ్లి మాట్లాడాలి. వీలైనంత త్వరగా వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అంటారు. దీప కడియం దగ్గరకు వెళుతుంది. హోటల్ తీసుకున్నట్టు చెప్తాడు. కడియం కార్తీక్ గురించి మాట్లాడుతాడు. అంత పెద్ద గొప్ప ఇంట్లో ఉంటూ ఈ పనులు చేయడం ఏంటని అడుగుతాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.