ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మాన్ సినిమాతో నివేదా థామస్ టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించాడు. అంతేకాదు నాని నివేదా ల జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా నుంచి నాని నివేదా మధ్య మంచి రిలేషన్ కూడా మొదలైంది. అంతేకాదు జెంటిల్ మాన్ ప్రమోషన్స్ లో నివేదా థామస్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలబడుతుందని తనలో అంత టాలెంట్ ఉందని పొగిడేశాడు.
అన్నట్టుగానే నివేదా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా నిలబడే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లతో సినిమాలు చేసిన నివేదా రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి నటించింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నివేదా ల మధ్య సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయట.
ఇక తన ఫస్ట్ హీరో నాని తో కలిసి మరోసారి నిన్ను కోరీ చేసిన నివేదా ఇప్పుడు వి లో నటించింది. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమాని ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించాడు. అయితే రీసెంట్ గా నాని నివేదా థామస్ ఆది పినిశెట్టి ల నిన్ను కోరీ సినిమా వచ్చి మూడేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సరదాగా నాని ఆది మాట్లాడుకున్నారు. ‘బ్రేకప్ అయిన ఉమా మహేశ్వరరావు అక్కడి నుంచి వెళ్లి మూడేళ్లు అవుతుందంటూ’ ఒక బ్రోకన్ హార్ట్ సింబల్ను షేర్ చేశాడు నాని.
దానికి ఆది ‘హెయ్ ఉమా.. మళ్లీ నువ్ వెనక్కి రావాలి.. నీ అదృష్టాన్ని పరీక్షించుకో.. ఈ సారి నా మనసు మార్చుకుంటానేమో ..అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు నిజంగా నాని నివేదా విషయంలో మనసు మార్చుకుంటాడా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారట. మొత్తానికి వీళ్ళ మధ్య చర్చ ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైనింగ్ గా అనిపించింది. ఇక ఈ సినిమాని శివ నిర్వాణ తెరకెక్కించగా కోన వెంకట్ నిర్మించారు. అంతేకాదు నిన్ను కోరీ నాని, నివేదా, ఆది లతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి ఒక గొప్ప అనుభూతిగా మిగిలింది.