ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అరికట్టడం కోసం పేరుగాంచిన చాలా యూనివర్సిటీలు వ్యాక్సిన్ తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచంనికి మొదటిగా మేమే వ్యాక్సిన్ ఇవ్వాలని పేరు సంపాదించాలని శాస్త్రవేత్తలు ఒకరితో మరొకరు పోటీ పడుతున్న పరిస్థితి ప్రపంచంలో నెలకొంది.
పరిస్థితి ఇలా ఉండగా కరోనా నివారణకు ఆవిరి చికిత్స (స్టీమ్ తెరఫీ) బాగా పనిచేస్తున్నట్లు ఇటీవల కొన్ని సర్వేలలో బయటపడింది. ఇటీవల చాలా వరకు కరోనా కట్టడి చేయడం కోసం వంటింటి చిట్కాలు ప్రధాన ఔషధాలుగా మానవ శరీరంలో పనిచేస్తున్నట్లు వైద్యశాస్త్రం కూడా ఒప్పుకోవటం తో చాలామంది ఆవిరి చికిత్సపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. తాజాగా ఇండియాలో ముంబైలో సెవెన్ హిల్స్ అనే ప్రముఖ హాస్పిటల్ లో కూడా వైద్యులు మూడు నెలలు ఆవిరి చికిత్స (స్టీమ్ థెరపీ) పై జరిపిన పరిశోధనలలో మెరుగైన ఫలితాలు రాబట్టడం జరిగింది.
1.ఈ ముంబై హాస్పిటల్ లో పాజిటివ్ బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల మెడిసిన్ వాడిన వారి కంటే చాలా త్వరగా కోలుకున్నట్లు వైద్యులు గుర్తించారు.
- ఈ స్టీమ్ తెరఫీ హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్న వారికి ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
- ఈ ఆవిరి విధానం విషయంలో ముంబై హాస్పిటల్ 105 మంది బాధితులను పర్యవేక్షణలోకి తీసుకుంది. వారిని రెండు గ్రూపులుగా విభజించింది.
4.మొదటి గ్రూపులో లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి చికిత్స చేయగా మూడు రోజుల్లోనే కోలుకున్నారట.
- ఇక కరోనా లక్షణాలు తీవ్రత ఎక్కువ కలిగిన వాళ్లు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా వారంలోనే సాధారణ స్థితికి వచ్చారట.
6.ఆవిరి పట్టడం విషయంలో క్యాప్సూల్స్, విక్స్, అల్లం ఇలా కొన్నింటితో వేడినీళ్లలో మిక్స్ చేసి రోగులకు పట్టించడంతో కరోనా ని ఆవిరిచేసే ఫలితాలు వచ్చినట్లు ముంబై సెవెన్ హిల్స్ హాస్పిటల్ పేర్కొంది.