సాధారణంగా అందరూ ఆనందాన్ని డబ్బులోనో, కారులోనో, తమకు నచ్చిన వ్యాపకం లోనో వెతుక్కుంటారు.. అయితే సేవా దృక్పథంలో ఆనందాన్ని వెతుక్కునే వారు మచ్చుకలో ఒకరో, ఇద్దరో ఉంటారు.. వారిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.. ఒక సాధారణ రైస్ మిల్లు కార్మికుని ఇంట్లో పుట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుంది.. తనకు ఏ మాత్రం తెలియని ఓ టీనేజర్ కు ఉమా ప్రేమన్ తన కిడ్నీని దానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదగా రియల్ హీరో అవార్డు అందుకున్న మహిళల్లో ఆమె కూడా ఒకరు.. అటువంటి అసాధారణ మహిళ జీవితం త్వరలో బహుభాషా బయోపిక్ గా రూపొందిస్తున్నారు..!
సుమారుగా 2లక్షల డయాలసిస్ లు, 20 వేలకు పైగా గుండె శస్త్ర చికిత్సలు, వందలాది మందికి కిడ్నీ మార్పిడులు , గిరిజనుల కోసం పాఠశాలలు, తక్కువ ఖర్చుతో ఇల్లు ఇలాంటివి ఎన్నో చేసిన సేవలలో ఇవి కొన్ని మాత్రమే.. అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటి పరోపకార మూత్రపిండ దాత.
ట్రాఫిక్ రామస్వామి ఫేమ్ విఘ్నేశ్వరన్ విజయన్ దర్శకత్వంలో ఈ బయోపిక్ డైరెక్ట్ చేయనున్నారు. ఆయన మాట్లాడుతూ నిస్వార్థ ప్రేమను మించిన గొప్ప విషయం మరొకటి లేదు..ఈ సినిమా పలువురికి స్ఫూర్తిదాయకంగా అవుతుందని నేను నమ్ముతున్నాను అని ఆయన చెప్పారు.. ఈ ఉద్వేగభరిత, ఫీమేల్ సెంట్రిక్ బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషించడానికి టాలీవుడ్ లోని టాప్ హీరయిన్లతో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.