Nimmagadda ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తన దూకుడు కొనసాగిస్తున్నారు.
ఓ వైపు ప్రభుత్వం మరోవైపు ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణ విషయంలో వ్యవహరిస్తున్నప్పటికీ ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ రమేష్ కుమార్ గవర్నర్తో భేటీ అయ్యారు. అంతకుముందు కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నిమ్మగడ్డ అధికారులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అధికార పార్టీ సైతం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Nimmagadda నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ప్లాన్-బీ అంటూ కేంద్ర బలగాల గురించి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర బలగాలపై ఇప్పటికే కేంద్ర హోంసెక్రటరీకి లేఖ రాశానని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ఆగకూడదన్నారు. ఏకగ్రీవాలను స్వాగతించండి.. కానీ ఎన్నికలకే ప్రాధాన్యం ఇవ్వండని నిమ్మగడ్డ సూచించారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
నిమ్మగడ్డ లో ఫ్యాక్షనిస్ట్ బుద్ధి
మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మలా మారారని… కీలుబొమ్మలా వ్యవహరించడం దురదృష్టకరమని సజ్జల రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఎత్తుకు పైఎత్తు వేస్తూ చవకబారు ధోరణిలోనే నిమ్మగడ్డ వ్యవహరించారని మండిపడ్డారు. నిమ్మగడ్డలో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనిపిస్తోందని… రిటైర్డ్ అధికారి అయ్యి ఉండి ఇతర అధికారులపై వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని సజ్జల పేర్కొన్నారు. ఎన్నిక విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారని.. తన పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ అధికారులపై చర్యలకు నిమ్మగడ్డ లేఖ రాశారని ఆయన ఆరోపణలు చేశారు.
ఎన్నికలు ఎలా…
కొత్త షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 9న తొలిదశ, 13న రెండో దశ, 17న మూడో దశ, 21న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9న జరిగే ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 29న ప్రారంభమవుతుంది. 13న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 2 నుంచి, 17న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 6 నుంచి, 21న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.