Crime News : నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నూజివీడు మండలం లైన్ తండాకు చెందిన 14 మంది గిరిజనులు వరికుప్పల నూర్పిడికి ఆటోలో వెళ్తుండగా హనుమాన్ జంక్షన్ వైపు నుండి అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది.. ఈ రోడ్డు ప్రమాదం లో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగతా 9 మందిని ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు..
*ఈ రోడ్డు ప్రమాద ఘటన కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
* ప్రమాదంలో మరణించిన వారికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
*ఈ ఘటన పై సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిచాలని అధికారులని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందిచాలని అధికారులకి తెలిపారు.