NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan: ఉద్యోగులకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..!?

employees shocked by cm jagan

YS Jagan: ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వోద్యోగులకు మధ్య దూరం పెరగనుందా.. అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై మొదట్లో సంఘీభావం ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. దీనిపై విడుదలైన జీఓ చూసి.. అవాక్కవుతున్నారు. పెంచిన పీఆర్సీ కంటే.. పాత జీతాలే బాగున్నాయనే భావం వారిలో వ్యక్తమవుతోంది. హెచ్ఆర్ఏ తగ్గింపు, సిటీ కాంపన్సేటరీ అలవెన్సు రద్దు, పెన్షనర్లకు అందే అదనపు మొత్తంలో వయో పరిమితి పెంచడం.. ఇవన్నీ వారికి రుచించట్లేదు. నిజానికి సీఎంతో భేటీ అనంతరమే ఉద్యోగ సంఘాలతో పెంచిన 23 శాతం పీఆర్సీపై ఉద్యోగులు విముఖత చూపించారు. ఇప్పుడు ఈ జీవోతో నిప్పు రాజుకున్నట్టేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నట్టు తెలుస్తోంది.

employees shocked by cm jagan
employees shocked by cm jagan

ఉద్యోగ సంఘాల మాట ఇదీ..

ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఇలాంటి పీఆర్సీని తన సర్వీస్‌లో చూడలేదని అంటున్నారు. కుడిచేత్తో ఇచ్చి ఎడం చేత్తో వసూలు చేస్తున్న చందంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంటే పాత పీఆర్సీ, డిఏలను  కొనసాగించడమే ఉత్తమమని అంటున్నారు. అశాస్త్రీయంగా ఇచ్చిన (YS Jagan) జీవోలను వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇది చీకటిరోజు. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని అన్నారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తే వ్యతిరేక జీవోలు విడుదల చేశారని ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

కీలక నిర్ణయం తీసుకుంటారా..

దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచీ ఉద్యోగుల్లో ఉన్న భయాలే నిజమయ్యాయని చెప్పాలి. ప్రభుత్వం తెలివితేటలతో పాత డీఏలు ఇస్తూ.. నగదు కనిపించేలా చేసింది కానీ.. వాస్తవంలో ఉద్యోగులకు తత్వం బోధపడినట్టైంది. పీఆర్సీతో పెరగాల్సిన ఉద్యోగుల వేతనాలు వారికి కనిపించడం లేదు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని.. అవసరమైతే సమ్మెకు దిగుతామని (YS Jagan) ఉద్యోగ సంఘాలు ప్రకటించడం పెద్ద ఉద్యమమే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులను మెప్పించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు వారితో కయ్యమే పెట్టుకున్నట్టైంది. జరుగుతున్న పరిణామాలతో ప్రభుత్వంపై ఉద్యోగులకు దూరం పెరిగినట్టే. మరి.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. పీఆర్సీపై పునరాలోచన చేస్తుందో.. వేచి చూడాల్సిందే..!

 

 

Related posts

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!