NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Counterfeit Kallu: కల్తీ కల్లు కేసులో బిగ్ ట్విస్ట్ ఇదీ..అయిదుగురు మృతికి కారకుడైన నిందితుడు అరెస్టు..!!

Counterfeit Kallu: కొంత మంది చాలా తెలివిగా నేరం చేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. తాము చేసిన నేరం వెలుగు చూడదు. సేఫ్ గా ఉండవచ్చు అని అనుకుంటారు. కానీ పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేస్తే నేరం చేసిన వాడు ఎలాగైనా దొరికి పోతాడు అని ఈ ఘటన రుజువు చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఇటీవల కల్తీకల్లు తాగడం వల్ల అయిగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును అటు ఎక్సైజ్, ఇటు సివిల్ పోలీసులు చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేయగా ఓ కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి హత్య కోసం జరిగిన కుట్రకు అయిగురు బలి అయ్యారు అని దీనికి ఓ వ్యక్తి అక్రమ సంబంద వ్యవహారం కారణం అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.

Big twist in the case of Counterfeit Kallu
Big twist in the case of Counterfeit Kallu

Counterfeit Kallu: జీలుగ కల్లు శాంపిల్స్  లో క్రిమి సంహారక మందు

కల్లు తాగి అయిదుగురు గిరిజనులు మృతి చెందడంతో తొలుత కల్తీ కల్లు అని అందరూ భావించారు. దీనిపై పోలీసులు, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపాయి. అయిదుగురు మృతి చెందడానికి కారణమైన జీలుగ కల్లు శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం కాకినాడలోని ఎక్సైజ్ శాఖ ప్రాంతీయ పరీక్షా కేంద్రానికి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కల్లులో క్రిమి సంహారక మందు కలిసినట్లు నిపుణులు గుర్తించారు. దీంతో ఆ శాంపిల్స్ ను ఫొరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపించారు. సాధారణంగా జీలుగ కల్లు తాగితే వ్యక్తులు చనిపోయే అవకాశం ఉండదు. దీని వెనుక ఎదో కుట్రకోణం ఉందని పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజం అయ్యింది. ఫొరెన్సిక్ రిపోర్టులోనూ క్రిమిసంహారక మందు కలిసినట్లు రిపోర్టు వచ్చింది.

 

ఒక వ్యక్తిని చంపేందుకు కుట్ర చేసి..

దీంతో ఈ కల్లులో క్రిమిసంహారక మందు కలపడానికి కారకులు ఎవరు ? ఎందుకు చేశారు ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు జరిపారు. మృతుల వివరాలు మొత్తం తీసుకుని వారిలో ఎవరికైనా గొడవలు ఉన్నాయా ? వాళ్లను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ? తదితర విషయాలపై లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతుల్లో ఒకరైన గంగరాజు భార్యతో రాంబాబు అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాంబాను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా నిజాన్ని అంగీకరించాడు. గంగరాజును చంపేందుకు రాంబాబు జీలుగ కల్లులో గడ్డి మందు కలపాడనీ, అ విషయం తెలియక గంగరాజుతో కలిసి కల్లు తాగిన మిగిలిన నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారని దర్యాప్తులో తేలింది. అయిదుగురు మృతికి కారణమైన రాంబాబును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!