Mahesh – Balakrishna: సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేశ్. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంగా ఈ సినిమా కథ సాగు తుంది. స్టైలిష్ యాక్షన్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఇది తెరకెక్కుతోంది. మే 12న సర్కారు వారి పాట థియేటర్స్లోకి రానుంది.
ఈ నేపథ్యంలో మహేశ్ నెక్స్ట్ మూవీస్ను సెట్స్ మీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు కూడా. ఇక ఇప్పటికే అగ్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ ఈ నెల 25వ తేదీన వస్తోంది. దీని తర్వాత మహేష్ లీడ్ గా ఉండే ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి రెడీ అవుతారు. అయితే, తాజా సమాచారం ప్రకారం నటసింహా నందమూరి బాలకృష్ణ, మహేశ్ – రాజమౌళి సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్టు తెలుస్తోంది.
Mahesh – Balakrishna: 40 నిమిషాల పాటు బాలయ్య అదరగొడతారట.
దర్శక ధీరుడు బాలయ్య కోసం అద్భుతమైన పాత్రను సృష్టించారని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ విని పిస్తోంది. సినిమాలో 40 నిమిషాల పాటు బాలయ్య అదరగొడతారట. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకతవంలో ఓ సినిమాను చేస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారట. ఇలా చేస్తున్న బాలయ్య ఆహా కోసం అన్ స్టాపబుల్ టాక్ షోనూ చేస్తూ అలరిస్తున్నారు.