Chiranjeevi: “ఆచార్య” సినిమా పరాజయం పాలైన తర్వాత చిరంజీవి రిలీఫ్ కోసం భార్య సురేఖతో దాదాపు నెల రోజుల పాటు విదేశీ పర్యటన చేపట్టడం తెలిసిందే. అయితే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఒప్పుకున్న సినిమాల షూటింగ్ లు కంప్లీట్ చేసే పనిలో చిరంజీవి బిజీ అయిపోయారు. ముందుగా మోహన్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “గాడ్ ఫాదర్” కి సంబంధించి ఫైనల్ టచ్ ఇచ్చే రీతిలో బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి కొన్ని సాంగ్స్ లో స్టెప్స్ వేయడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే నేటి నుండి మెహర్ రమేష్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో “బోలా శంకర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు 40 శాతం చిత్రీకరణ జరిగింది. అయితే మిగతా బ్యాలెన్స్ షూటింగ్ నేటి నుండి స్టార్ట్ కావడం జరిగింది. తాజా షెడ్యూల్ లో చిరంజీవి భారీ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ లో జాయిన్ కానున్నారు. రామ్ -లక్ష్మణ్ నేతృత్వంలో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరగనుంది.
ప్రజెంట్ చిత్రీకరించ బోయే ఫైట్.. సినిమాలో హైలెట్ లో ఒకటి అని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన “వేదాళం” సినిమాకి రీమేక్..గా “బోలా శంకర్” తెరకెక్కుతుంది. ఈ క్రమంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తిసురేష్ కనిపించనుండగా.. చిరంజీవి పక్కన హీరోయిన్ పాత్రలో తమన్నా నటిస్తోంది. మహతి సర్వ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.