Pooja Heghde: దక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ పూజా హెగ్డేకి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ మోస్ట్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. సౌత్ లో మాత్రమే కాదు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మహమ్మారి కరోనా రాకముందు పూజా హెగ్డే నటించిన సినిమాలు దాదాపు బ్లాక్ బస్టర్ హిట్స్. దీంతో అమ్మడు చాలామంది నిర్మాతలకు మరియు డైరెక్టర్లకు లక్కీ హీరోయిన్ అయిపోయింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే కరోనా తర్వాత పూజా హెగ్డే నటించిన రాధేశ్యాం, బీస్ట్, ఆచార్య మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం తెలిసిందే. ఈ మూడింటిలో ముఖ్యంగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన “బీస్ట్” భారీ అంచనాల మధ్య విడుదలైన అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. ప్రొడ్యూసర్స్ బాగా నష్టపోయారు. ఈ పరిణామంతో “బీస్ట్” సినిమా నిర్మాతలు.. హీరోయిన్ పూజా హెగ్డేకి ఊహించని షాక్ ఇచ్చినట్లు తమిళ సినిమా రంగంలో లేటెస్ట్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. మేటర్ లోకి వెళ్తే “బీస్ట్” సినిమా షూటింగ్ టైంలో పూజా హెగ్డే టీంకి భారీగా డబ్బులు ఖర్చయిందని, కేవలం వాళ్ల ఫుడ్ కి కొన్ని లక్షలు ఖర్చు అయినట్లు ఆ బిల్లులు ఇటీవల “బీస్ట్” సినిమాలు నిర్మాతలకు అందాయని సమాచారం. దీంతో “బీస్ట్” సినిమా నిర్మాతలు పూజాహెగ్డే స్టాఫ్ బిల్లులు చూసి ఖంగు తిన్నారట.
“బీస్ట్” సినిమా భారీ అంచనాల మధ్య దారుణంగా పరాజయం పాలు కావడంతో భారీగా నష్టపోయిన నిర్మాతలు… పూజా హెగ్డే స్టాఫ్ ఖర్చులు మరింత భారం అయ్యాయట. ఈ పరిణామంతో పూజా హెగ్డే స్టాఫ్ భోజనం బిల్లులతో తమకు సంబంధం లేదని ఆ ఖర్చులను.. పూజా హెగ్డే యే భరించాలని “బీస్ట్” నిర్మాతలు చేతులెత్తేసినటు సమాచారం. అంతమాత్రమే కాకుండా బిల్లులు మొత్తం పూజా హెగ్డేకి తిరిగి పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. “బీస్ట్” సినిమా పెద్దగా ఆడకపోవడంతో.. పూజా హెగ్డే పరిస్థితిని అర్థం చేసుకుని ఆ బిల్లులను తానే చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తుంది. మరి వస్తున్న వార్తల్లో నిజం ఎంతో అనేది ప్రస్తుతానికి తెలియదు. మరి ఈ వార్తలపై పూజ హెగ్డే..లేదా “బీస్ట్” నిర్మాతలైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.