అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (79) మరో సారి కరోనా బారిన పడ్డారు. ఈ నెల 22వ తేదీన తొలిసారి జై బైడెన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే చికిత్స అనంతరం కోవిడ్ నుండి బైడెన్ పూర్తిగా కొలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుండి మూడు రోజుల క్రితం ప్రకటన విడుదల అయ్యింది. కానీ తాాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు మళ్లీ కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో అధ్యక్షుడు బైడెన్ మరో సారి ఐసోలేషన్ కు వెళ్లారు.
అయితే బైడెన్ కు స్వల్ప లక్షణాలే ఉన్నాయనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు కేవిన్ ఓ కానర్ తెలిపారు. బైడెన్ కు గత శనివారం నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో ఐసోలేషన్ కు వెళ్లారు. చికిత్స నిర్వహించిన తరువాత వరుసగా నాలుగు రోజులు నెగెటివ్ గా తేలిన తర్వాత మళ్లీ పాజిటివ్ రిపోర్టు రావడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.