హైదరాబాద్ లోని మార్గదర్శి కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు తొమ్మిది గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. మార్గదర్శి ఆఫీసులోని బ్యాలెన్స్ షీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను సీఐడీ బృందం పరిశీలిస్తొంది. రేపు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్ లను సీఐడీ అధికారులు విచారించారు. విచారణ సమయంలో డాక్యుమెంట్ లు చూపాలని సీఐడీ అధికారులు కోరగా తమ వద్ద డాక్యుమెంట్లు లేవని వారు తెలిపారనీ, దీంతో ఆఫీసుకు సీఐడీ బృందం వచ్చి డాక్యుమెంట్లు పరిశీలన చేస్తున్నారు. మరో పక్క సీఐడీ కార్యాలయంలో విచారణకు హజరు కావాలంటూ శైలజా కిరణ్ కు నోటీసులు కూడా ఇచ్చారు.
ఇదిలా ఉంటే .. మార్గదర్శి చిట్ ఫండ్ లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ సంస్థ అక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన చెప్పారు. చిట్ పండ్ చట్టం 1982 ను మార్గదర్శి యాజమాన్యం ఉల్లంఘించిందన్నారు. చిట్ కట్టిన చందాదారుల సొమ్మును దారి మళ్లించడం నేరమేనని అన్నారు. సంస్థ మొత్తం మునిగిపోయేంత వరకూ ప్రభుత్వం చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోదని సంజయ్ హెచ్చరించారు.
ఎవరు ఫిర్యాదు చేయకపోయినా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ విషయాన్ని గతంలోనే సుప్రీం కోర్టు శ్రీరామ్ చిట్ ఫండ్స్ కేసులో చెప్పిందని సంజయ్ గుర్తు చేశారు. మార్గదర్శి యాజమాన్యం పూర్తిగా నిబందనలు ఉల్లంఘించిందని తమ సోదాల్లో నిర్దారణ అయ్యిందని, మనీలాండరింగ్ నిధుల మళ్లింపు కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు. నియంత్రణ సంస్థలకు కూడా అవసరమైన పత్రాలను మార్గదర్శి సమర్పించకపోవడం మోసగించడం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ఏ 1 నుండి ఏ 5 వరకూ నిందితులను ప్రశ్నించామనీ, కానీ వారు సరైన సమాదానాలు ఇవ్వలేదన్నారు. దీంతో మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని మరింత తేటతెల్లమవుతుందన్నారు.
YS Jagan: చంద్రబాబు సెల్పీలకు జగన్ కౌంటర్ ఇది