ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ దిగ్భాంతి వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమీపంలో సిలెండర్లు పేలడంతో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం బాధాకరమని అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మంత్రులు కేటిఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యున్నత స్థాయి వైద్యం అందించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. చీమలపాడులో బీఆర్ఆర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ సందర్భంగా నాయకులు తరలివస్తుండగా పార్టీ శ్రేణులు టపాసులు కాల్చారు. టపాసులు కాల్చడంతో మండలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి, మంటలు చెలరేగి లోపల ఉన్న వాహనాలు దగ్ధమైయ్యాయి.
అదే సమయంలో నివాసంలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలడంతో పెను ప్రమాదం సంభవించింది. సిలెండర్ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగి పడ్డాయి. ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, జర్నలిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న ఒ సీఐ సహా పది మంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చెందినట్లుగా సమాచారం అందింది.
Fire Accident: మల్లాపూర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం