Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో దారణ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో ఈ ఘటన జరిగింది. ఆ దంపతులతో పాటు సమీపంలో నిద్రిస్తున్న బాలికకూ మంటలు అంటుకున్నాయి.
ఎల్లనూరు మండలం వేములపల్లి గ్రామానికి చెందిన నల్లపురెడ్డి, కృష్ణవేణమ్మ గత కొన్నేళ్లుగా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె వద్ద ఓ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న వీరి సమీప బంధువు రమేష్ రెడ్డి మద్యానికి బానిస అయ్యాడు. దీనిపై నల్లపురెడ్డి అతన్ని గత మూడు రోజులుగా మందలిస్తున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న రమేష్ రెడ్డి శనివారం అర్ధరాత్రి ఆరుబయట మంచంపై నిద్రిస్తున్న నల్లపురెడ్డి, కృష్ణవేణమ్మ దంపతులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
దీంతో దంపతులతో పాటు అక్కడే నిద్రిస్తున్న పూజిత అనే బాలికకూ మంటలు అంటుకున్నాయి. దంపతులకు తీవ్ర గాయాలు కాగా, బాలికకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KCR: తెలంగాణ సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు .. వారిపై ఆ కేసులు ఎత్తివేయండి