KCR: పౌర హక్కుల నేత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరిగోపాల్ తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేథావులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసిన అంశం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ప్రొఫెసర్ హరిగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన సురేశ్, ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్ తదితరులపై ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసులు నమోదు అయ్యాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, ఐపీసీలోని పది సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
వీరిపై దేశద్రోహం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని సీపీఐ తో పాటు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి, వారిపై ఆ కేసులు నమోదు చేయడం తీవ్ర వివాదాస్పదం అవ్వడంతో తెలంగాణ సీఎం కేసిఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ కు సీఎం ఆదేశించారు.
మవోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్ తో పాటు ఇతర ప్రజా సంఘాల నేతలపై ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని, వెంటనే వారిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Road Accident: వ్యాన్ – కారు ఢీ .. నలుగురు మృతి