Road Accident: జాతీయ రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమైయ్యాయి. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా, అధికారులు సూచనలు చేస్తున్నా వాహన చోదకులు మాత్రం నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగ కోనసీమ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవ్వగా, మరో తొమ్మది మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన తొమ్మిది మంది టాటా మ్యాజిక్ వ్యాన్ లో కొత్తపేట మండలం మందపల్లికి దైవ దర్శనం కోసం బయలుదేరారు.
వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని కోనసీమ జిల్లా ఆలమీరు మండలం పరిధిలోని మడికి జాతీయ రహాదారిపై విశాఖ నుండి వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడగా, వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పవన్ వారాహి యాత్ర రెండో సభలోనూ అపశృతి .. 20 మంది అభిమానులకు గాయాలు