NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Elections: 27న అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ..?

Telangana Assembly Elections: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ నెల 27న అమిత్ షాను పవన్ కలవనున్నారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన పొత్తు గురించి ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్ ను బీజేపీ కోరిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో 20కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకం కానుంది.

Pawan Kalyan Amit Shah

పవన్ తో ఈ నెల 18న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. ఎన్నికల్లో జనసేన మద్దతు కోరారు. అయితే ఈ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ నేతలు సన్నద్దతను తెలియజేసిన విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్. అంతకు ముందు జనసేన ఏయే నియోజకవర్గాల నుండి పోటీ చేయాలనే జాబితాను కూడా జనసేన విడుదల చేసింది. అయితే పొత్తులో భాగంగా 20 స్థానాలు కేటాయించాలని అంతర్గతంగా ప్రతిపాదన పెట్టినట్లు గా తెలుస్తొంది. దీనికి మాత్రం బీజేపీ సుముఖంగా లేదనీ, పది నుండి 12 స్థానాలు పొత్తులో జనసేనకు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

BJP-Janasena to party ways?
bjp-janasena

అసలు వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాదిరిగానే జనసేన పోటీ చేయకుండా పూర్తిగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరాలని భావించారు. కానీ జనసేన నేతలు ముందుగా పవన్ కళ్యాణ్ ముందు ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని లేకుంటే పార్టీ క్యాడర్ దెబ్బతింటుందని, సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దీంతో జనసేన ఈ సారి ఎన్నికల్లో బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలన్న నిశ్చయంతో ఉంది. జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపుపై అమిత్ షా ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.  

అమిత్ షా ఎల్లుండి (అక్టోబర్ 27)  తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఓ  పక్క అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పర్యటించిన అమిత్ షా మరో సారి ఈ నెల 27న రానున్నారు. సూర్యాపేట లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే బీజేపీ 52 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. మరో రెండు మూడు రోజుల్లో రెండో జాబితా విడుదలకై కసరత్తు చేస్తొంది.

అయితే జనసేనతో సీట్ల పంపిణీకి సంబంధించి మరో సారి చర్చలు జరగాల్సి ఉండటంతో రెండో జాబితా ఆలస్యం అవుతోందని సమాచారం. మరో పక్క మొదటి జాబితాలో తమ పేర్లు లేని కొంత మంది ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరితో అమిత్ షా సమావేశం అవ్వనున్నారని తెలుస్తొంది. అసంతృప్తి నేతల భవిష్యత్తుకు అమిత్ షా భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అమిత్ షాతో పవన్ భేటీ అనంతరం పొత్తు సీట్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఎన్ని స్థానాలకు జనసేన ఒకే అంటుందో..!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మొదటి విడత బస్సు యాత్ర షెడ్యుల్ విడుదల.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఒకే సారి ..

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju