Sankranthi Celebrations 2024: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబించే విధంగా సీఎం వైఎస్ జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవడం అనవాయితీగా వస్తొంది.
ఆ క్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పండుగ సంబరాలు ఆరంభమైయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. తదుపరి గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారులు పదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ సంబరాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. “ఊరూ వాడా ఒక్కటే .. బంధు మిత్రులు ఏకమై.అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని, సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ .. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.
ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2024