Guntur Kaaram: ఈ సంక్రాంతి పండుగకు మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” అతిపెద్ద సినిమాగా విడుదలయ్యింది. ఈ సినిమాకే రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికమైన థియేటర్లు కేటాయించడం జరిగింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత మహేష్ సినిమా ధియేటర్ లో విడుదల కావడంతో “గుంటూరు కారం” ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వచ్చాయి. జనవరి 12వ తారీకు అర్ధరాత్రి ఒంటిగంట నుండే షోలు పడ్డాయి. ఈ సినిమాకి మొదట మిక్సడ్ టాక్ రావడం జరిగింది. అయితే సాయంత్రానికల్లా మెల్ల మెల్లగా టాక్ మారుతూ వచ్చింది. ఇదే విషయాన్ని నిన్న దిల్ రాజు మరియు నిర్మాత నాగ వంశీ తెలియజేశారు. మొదట నెగిటివ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే గాని సాయంత్రానికల్లా..టాక్ మారుతూ వచ్చింది.
గతంలో అట్టర్ ఫ్లాప్ టాక్ నుండి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ దిశగానే “గుంటూరు కారం” టాక్ షో షోకి మారుతుంది. ఈ సినిమా విజయం సాధించిందో లేదో సంక్రాంతి పండుగ తర్వాత తెలియనుంది అని వివరించారు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా సినిమాలకు కూడా ఈ రకమైన టాక్ రావడం జరిగింది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు టెలివిజన్లో ప్రసారమైన టీఆర్పి రేటింగులు భారీగా నమోదు అవుతాయి. ఆ రకమైన రెస్పాన్స్ ప్రస్తుతం “గుంటూరు కారం”కి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మొదటి రోజు 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలిపిన సినిమా యూనిట్ రెండవ రోజుకి 127 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది అని సూపర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చిత్ర యూనిట్ అధికారికంగా ట్విట్టర్లో తెలియజేసింది.
ఈ భోగికి మీలో ఉన్న ఈగోలు మరియు హెట్రేడ్ అని మంటలలో కాల్చేస్తారు అని ఆశిస్తూ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు.. అని పోస్ట్ పెట్టడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే “గుంటూరు కారం”కి టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా మంచిగానే వస్తున్నట్లు తాజా పరిస్థితి బట్టి అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మార్చి నెలలో రాబోతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థాయిలో దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించనున్నట్లు టాక్ నడుస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!