Guntur Kaaram: తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలలో ” గుంటూరు కారం ” ఒకటి. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని వెలుగు చూసింది. ఇక ఈ ఫలితాన్ని చూసి సూపర్ స్టార్ అభిమానులు సైతం కుప్పకూలిపోయారు. ఇక ఈ సినిమాని తెరకెక్కించిన త్రివిక్రమ్ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని ప్రస్తుతం ఓ వార్త వినిపిస్తుంది.
ఈ సినిమా కోసం మహేష్ తన 100% ఎఫెక్ట్ పెట్టాడు. కానీ ఎప్పుడూ తన మాటలతో అందరినీ మెప్పించే త్రివిక్రమ్ ఈసారి మాత్రం ఫెయిల్ అయ్యాడు. దీనికి కారణం మహేష్, త్రివిక్రమ్ మధ్య గొడవేనని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ఎన్నో మనస్పార్ధాలు వచ్చాయట. ఈ సినిమాలో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చాలని మహేష్ చాలా పట్టుపట్టాడట.
కానీ ఇందుకు త్రివిక్రమ్ అస్సలు ఒప్పుకోలేదట. ఈ తరుణంలోనే మహేష్ త్రివిక్రంపై సీరియస్ కూడా అయ్యాడట. ఇక ఈ క్రమంలోనే మహేష్ పై ఎంతో కోపం పెట్టుకున్న త్రివిక్రమ్.. మహేష్ కెరీర్ లో ఒక ఫ్లాప్ వేయాలనుకున్నాడట. ఇందువల్లే సరైన మాటలు, కథ కూడా రాయలేదు త్రివిక్రమ్. ఇక ఇందువల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!