YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్దమైయ్యారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు రాష్ట్ర పర్యటన చేయనున్నారు. రేపటి నుండి తొమ్మిది రోజుల పాటు 26 జిల్లాల్లో పర్యటించి పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.
రోజుకు మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు టూర్ షెడ్యుల్ ను సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం చేయడంలో భాగంగా ముఖ్యనేతలతో సమావేశాలు, చేరికపై ఫోకస్ పెట్టనున్నారు.
ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో, 24 న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలు, ఈ నెల 25 న కాకినాడ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఈ నెల 26 న ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో, ఈ నెల 27 న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, ఈ నెల 28 న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, ఈ నెల 29 న తిరుపతి, చిత్తూర్, అన్నమయ్య జిల్లాలో, ఈ నెల 30 న శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూల్ జిల్లాలో, ఈ నెల 31 న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు.
పర్యటన షెడ్యుల్ పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి TP_APCC_YSS